దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నాడు సోనూ సూద్. అయితే ఇన్నేళ్లలో సినిమాలతో తెచ్చుకున్న పేరంతా ఒకెత్తయితే.. కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ టైంలో తన సేవా కార్యక్రమాలతో సంపాదించిన పేరు మరో ఎత్తు. వలస కార్మికులతో మొదలుపెట్టి ఎంతో మంది అభాగ్యులను అతను ఆదుకున్నాడు. లాక్ డౌన్ ముగిశాక కూడా అతను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు.
వివిధ మార్గాల్లో తనను సాయం కోసం అభ్యర్థిస్తున్న వాళ్ల వివరాలు తెలుసుకుని తన టీం ద్వారా సాయపడుతున్నాడు. ఇందుకు ప్రధానంగా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. ఐతే నేరుగా సోనూనూ కలిసే వారి సంఖ్య కూడా తక్కువగా ఏమీ లేదు. సోనూ ముంబయిలో ఇంటిదగ్గర ఉన్నా.. లేదా బయటెక్కడైనా షూటింగ్కు వెళ్లినా.. అక్కడ ఒక గ్రీవెన్స్ సెల్ లాంటిది ఏర్పాటవుతుంటడం విశేషం.
దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు సోనూ టీంను సంప్రదించి అతనెక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వచ్చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. తాజాగా సోనూ హైదరాబాద్లో బెల్లకొండ శ్రీనివాస్ సినిమా ‘అల్లుడు అదుర్స్’లో నటిస్తుండగా.. అక్కడికి రోజూ పదుల సంఖ్యలో జనం వస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి సోనూ కలుస్తుండటం విశేషం. సోనూతో పాటు రెండంకెల సంఖ్యలో అతడి టీం కూడా వెంట వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది.
ఓవైపు సోనూ టీం, మరోవైపు అతణ్ని సాయం కోసం కలిసేవాళ్లతో షూటింగ్ స్పాట్లో హంగామా కనిపిస్తోంది. యూనిట్లో ఎంతమంది ఉన్నారో.. అంతకుమించి సోనూ చుట్టూ జనం ఉంటున్నారు ఎప్పుడూ. దీంతో ఆ ప్రాంతమంతా గోల గోలగా మారిపోతోంది. ఇది చిత్ర బృందానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, సమయం వృథా అవుతున్నా, తమ ఖర్చు పెరుగుతున్నా.. సోనూ మంచి మనసును దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం సర్దుకుంటోంది.
This post was last modified on November 5, 2020 6:18 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…