దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నాడు సోనూ సూద్. అయితే ఇన్నేళ్లలో సినిమాలతో తెచ్చుకున్న పేరంతా ఒకెత్తయితే.. కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ టైంలో తన సేవా కార్యక్రమాలతో సంపాదించిన పేరు మరో ఎత్తు. వలస కార్మికులతో మొదలుపెట్టి ఎంతో మంది అభాగ్యులను అతను ఆదుకున్నాడు. లాక్ డౌన్ ముగిశాక కూడా అతను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు.
వివిధ మార్గాల్లో తనను సాయం కోసం అభ్యర్థిస్తున్న వాళ్ల వివరాలు తెలుసుకుని తన టీం ద్వారా సాయపడుతున్నాడు. ఇందుకు ప్రధానంగా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతోంది. ఐతే నేరుగా సోనూనూ కలిసే వారి సంఖ్య కూడా తక్కువగా ఏమీ లేదు. సోనూ ముంబయిలో ఇంటిదగ్గర ఉన్నా.. లేదా బయటెక్కడైనా షూటింగ్కు వెళ్లినా.. అక్కడ ఒక గ్రీవెన్స్ సెల్ లాంటిది ఏర్పాటవుతుంటడం విశేషం.
దేశంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు సోనూ టీంను సంప్రదించి అతనెక్కడున్నాడో తెలుసుకుని అక్కడికి వచ్చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. తాజాగా సోనూ హైదరాబాద్లో బెల్లకొండ శ్రీనివాస్ సినిమా ‘అల్లుడు అదుర్స్’లో నటిస్తుండగా.. అక్కడికి రోజూ పదుల సంఖ్యలో జనం వస్తున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి సోనూ కలుస్తుండటం విశేషం. సోనూతో పాటు రెండంకెల సంఖ్యలో అతడి టీం కూడా వెంట వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది.
ఓవైపు సోనూ టీం, మరోవైపు అతణ్ని సాయం కోసం కలిసేవాళ్లతో షూటింగ్ స్పాట్లో హంగామా కనిపిస్తోంది. యూనిట్లో ఎంతమంది ఉన్నారో.. అంతకుమించి సోనూ చుట్టూ జనం ఉంటున్నారు ఎప్పుడూ. దీంతో ఆ ప్రాంతమంతా గోల గోలగా మారిపోతోంది. ఇది చిత్ర బృందానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, సమయం వృథా అవుతున్నా, తమ ఖర్చు పెరుగుతున్నా.. సోనూ మంచి మనసును దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం సర్దుకుంటోంది.
This post was last modified on November 5, 2020 6:18 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…