పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లో మేకింగ్ కోసం అత్యధిక సమయం తీసుకున్న చిత్రమిదే. అనౌన్స్ అయిన ఐదేళ్లకు గానీ ఈ సినిమా రిలీజ్ కావట్లేదు. ఈ ఏడాది ఆల్రెడీ రెండు డేట్లు మిస్ అయిందీ చిత్రం. నెక్ట్స్ టార్గెట్ మే 30 అని వార్తలు వచ్చాయి. కానీ అది సాధ్యం కాదని తెలుస్తోంది. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టమని అంటున్నారు. పైగా అదే డేట్కు రావాల్సిన ‘కింగ్డమ్’ను వాయిదా వేయడంలోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు.
జూన్ తొలి వారం కమల్ హాసన్ సినిమా ‘థగ్ లైఫ్’, బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ ‘హౌస్ ఫుల్-5’ పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతున్నాయి. వాటికి పోటీగా వెళ్లడం కుదరదు. దీంతో జూన్ 12 డేట్ను వీరమల్లు టీం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో ఓటీటీ డీల్ పరంగా కూడా ఒక చిక్కుముడి ఉంది. డిజిటల్ హక్కులు తీసుకుంటున్న సంస్థ ఫిక్స్ చేసే ఓటీడీ రిలీజ్ డేట్ను అనుసరించి కూడా థియేట్రికల్ రిలీజ్ డేట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
అందరికీ ఆమోదయోగ్యమైన తేదీ జూన్ 12 అని తాజాగా వార్తలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ మేరకు సమాచారం ఇచ్చేసినట్లు చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. ఆన్ లైన్ టికెటింగ్ యాప్ ‘బుక్ మై షో’లో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పేర్కొన్నారు. జూన్ 12న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ప్రస్తావించారు. దీంతో పవన్ అభిమానులు ఆ డేట్కే ఫిక్స్ అయిపోతున్నారు. పవన్ ఇటీవలే చివరి షెడ్యూల్ చిత్రీకరణకు హాజరై సినిమాను పూర్తి చేసినట్లుగా అప్డేట్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇంకో నెల రోజుల్లో ‘వీరమల్లు’ ఆగమనం ఖాయమే అనుకోవాలి.
This post was last modified on May 9, 2025 7:50 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…