అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం ప్రీ ప్రోడుక్షన్ పనుల్లో బిజీగా ఉంది. పాత్రల ప్రాధాన్యతకు అనుగుణంగా చిన్నా పెద్ద కలిపి ఇందులో అయిదుగురు హీరోయిన్లు ఉంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీలో బన్నీ హీరో, విలన్ గా డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు వస్తున్న అప్డేట్ అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. అధికారికంగా ప్రకటించలేదు కానీ గతంలోనే వచ్చిన ఈ లీక్ దాదాపు నిజమే. అయితే ఇలా నాయకుడు, ప్రతినాయకుడిగా రెండు క్యారెక్టర్స్ పోషించే సాహసం చేసిన హీరోలు గతంలోనూ ఉన్నారు.
మచ్చుకు కొన్ని చూద్దాం. సూర్య (24), కమల్ హాసన్ (అభయ్), కృష్ణ (మానవుడు దానవుడు), బాలకృష్ణ (సుల్తాన్), రజనీకాంత్ (రోబో), విజయ్ (గోట్ గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం), ఫ్యాన్ (షారుఖ్ ఖాన్), శోభన్ బాబు (జగన్) ముఖ్యమైన ఉదాహరణలుగా చెప్పుకొచ్చు. ఇవన్నీ డబుల్ ఫోటో సినిమాలే. కాకపోతే అధిక శాతం బ్లాక్ బస్టర్లు కాలేకపోయాయి. రోబో ఒకటే ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఈ లిస్టులో చేరబోతున్నాడు. సై ఫై జానర్ కాబట్టి విలన్ పాత్ర డిజైనింగ్ ఊహకందని రీతిలో ఉంటుందని తెలిసింది. గెటప్ షాక్ ఇచ్చేలా దర్శకుడు అట్లీ డిజైన్ చేసుకున్న తీరు అబ్బురపరచడం ఖాయమంటున్నారు.
2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం అంతర్జాతీయ సంస్థలు పని చేస్తున్నాయి. సూపర్ హీరో కాన్సెప్ట్ ని అంతర్లీనంగా తీసుకుని దానికి తనదైన శైలి కమర్షియల్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాడు అట్లీ. పుష్ప తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బన్నీ సైతం చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇంకో మెయిన్ విలన్ ఎవరనేది మాత్రం గుట్టుగా ఉంచుతున్నారు. విదేశీ నటుడిని తీసుకునే ప్లాన్ లో ఉన్నారట. అదెవరనేది తెలియాల్సి ఉంది. ఐకాన్ స్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ దీన్ని నిర్మించబోతోంది. 500 కోట్ల పైమాటేనని టాక్.
This post was last modified on May 7, 2025 4:47 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…