ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్ 2 కోసం ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇంకో 100 రోజుల్లో ఈ దిగ్గజాల యుద్ధాన్ని చూడబోతున్నాం. ప్రమోషన్ల పరంగా కూలి రెండు మూడు అడుగులు ముందే ఉండటం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. తాజాగా కూలీ కౌంట్ డౌన్ టీజర్ వదిలారు. మొహాలు చూపించకుండా హీరోల బ్యాక్ షాట్స్ చూపించి అనిరుద్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అంచనాలు ఎక్కడికో వెళ్లేలా కట్ చేశారు. రజినిని మాత్రమే కొంతమేర రివీల్ చేశారు.
దీనికన్నా ముందు పాట ప్రోమో, అనౌన్స్ మెంట్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇలా కూలికి సంబంధించిన కంటెంట్ బాగానే వచ్చింది. కానీ వార్ 2లో తారక్, హృతిక్ ఎలా ఉంటారో కూడా చూపించలేదు. కనీసం ఒక్క ఇమేజ్ బయటికి రాలేదు. పాటల సంగతి తర్వాత కనీసం ఒక చిన్న టీజర్ వచ్చినా అభిమానులు పండగ చేసుకుంటారు. కానీ యాష్ రాజ్ ఫిలింస్ నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. హడావిడి లేదు. హంగామా లేదు. సైలెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటోంది. ఇంకొక్క పాట బాలన్స్ ఉండటంతో త్వరలోనే ఇద్దరు హీరోల కాంబోలో దాన్ని షూట్ చేయబోతున్నారు. ఈ నెలాఖరుకి పూర్తవ్వొచ్చు.
కంటెంట్ పరంగా పోల్చుకుంటే రెండు సినిమాలు నువ్వా నేనా అనే స్థాయిలో ఉన్నాయి. కూలిలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఊరిస్తుండగా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కాంబో హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తోంది. అయితే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సరే యష్ రాజ్ బృందం మరీ ఇంత మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. అసలే ఇది హిందీ సినిమా. తెలుగుతో సహా మిగిలిన భాషల్లో డబ్బింగ్ అవుతుంది. కూలి కూడా అంతే కావొచ్చు కానీ తీసింది సౌత్ దర్శకుడు కాబట్టి లోకల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత త్వరగా వార్ 2 పబ్లిసిటీకి తెరతీయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on May 6, 2025 11:11 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…