లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. అందులోనూ ఆ రంగంలో అత్యధిక ఆదాయానికి కేంద్ర బిందువైన థియేటర్ల పరిశ్రమ కరోనా వల్ల దారుణంగా దెబ్బ తింది. సినిమాల మీద ఆధారపడ్డ మిగతా వాళ్లందరూ మళ్లీ పని మొదలుపెట్టారు కానీ.. థియేటర్లను నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఇప్పటికీ ఉపాధి లేదు. గత నెలలో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా పది శాతం థియేటర్లు కూడా తెరుచుకోలేదు.
థియేటర్లు మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థాయిలో నడుస్తాయో తెలియట్లేదు. ఈ రంగం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. మరింత నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేలా ఉంది. దేశంలోనే అతి పెద్ద థియేట్రికల్ చైన్ అయిన పీవీఆర్ సంస్థ ఈ ఏడాది మూడో క్వార్టర్కు సంబంధించి తాజాగా విడుదల చేసిన లాభ నష్టాల లెక్కలు చూస్తే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
అన్ని థియేట్రికల్ ఛైన్స్ లాగే ఈ ఏడాది తొలి క్వార్టర్లో మంచి ఆదాయం అందుకున్న పీవీఆర్.. రెండో క్వార్టర్లో దారుణంగా దెబ్బ తింది. మూడో క్వార్టర్లో మరింతగా సంస్థ పతనం అయింది. గత మూడు నెలలకు గాను ఆదాయం లేకపోగా రూ.184 కోట్ల నష్టం వాటిల్లిందట పీవీఆర్కు. థియేటర్ల మెయింటైనెన్స్, సిబ్బందికి ఇస్తున్న అరకొర జీతాలు లెక్క వేసినా ఇంత మొత్తంలో నష్టం వాటిల్లింది.
గత ఏడాది ఇదే క్వార్టర్లో ఆ సంస్థ రూ.48 కోట్లు లాభాలు అందుకుంది. గత నెల 15న థియేటర్లు తెరవడం వల్ల గత రెండు వారాల్లో కొంత మేర ఆదాయం వచ్చింది. కానీ ఆ మొత్తం థియేటర్ల మెయింటైనెన్స్కు కూడా సరిపోని పరిస్థితి. గత ఏడాది సెప్టెంబరు 30 నాటికి పీవీఆర్ నికర ఆదాయం రూ.973 కోట్లుగా ఉండగా.. ఈసారి అది రూ.40 కోట్లకు పడిపోయింది. మిగతా మల్టీప్లెక్సుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…
ఇటీవల టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ జరిగి అది మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ…
బాలీవుడ్ చిత్రాలతో పోలిస్తే సౌత్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదన్నట్లు.. వాళ్ల పనికి సరైన కాంప్లిమెంట్స్ రావన్నట్లు…
గత నెలలో విడుదలైన సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ థియేటర్లో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఏకంగా…
భారత దేశ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ తో విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన దీక్ష…