మొదటి వారం కాకుండానే హిట్ 3 ది థర్డ్ కేస్ వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. కేవలం నాలుగు రోజులకే ఈ ఫీట్ సాధించడం ఊహించనిది. ఎందుకంటే ఏ రేటెడ్ మూవీ, అందులోనూ నానినే స్వయంగా ఫ్యామిలీలను రావొద్దని చెప్పిన సినిమా ఇంత వేగంగా ఈ మైలురాయి అందుకోవడం ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతోంది. నిన్న మొన్న వీకెండ్ ని అర్జున్ సర్కార్ డామినేట్ చేశాడు. తనకన్నా మెరుగైన టాక్ తెచ్చుకున్న తుడరుమ్ తో తలపడుతూ, నార్త్ లో పెద్ద రిలీజ్ దక్కించుకున్న రైడ్ 2 కి ధీటుగా బుక్ మై షోలో నెంబర్లు నమోదు చేయడం మార్కెట్ పరంగా పెరిగిన నాని ఇమేజ్ ని సూచిస్తుంది.
అసలు విషయం వేరే ఉంది. నాని ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి వంద కోట్ల ధైర్యాన్ని ఇచ్చాడు. నెలరోజులకు పైగా థియేటర్లలో జనం లేక షోలు క్యాన్సిలవుతూ అసలు టాలీవుడ్ ఎటు పోతోందో అని ఆందోళన వ్యక్తమవుతున్న టైంలో ఇంత కలెక్షన్ రాబట్టడం మాములు జోష్ ఇవ్వడం లేదు. అటుపక్క ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ దాటేయడం ఇంకో శుభ పరిమాణం. ఇదే సమయంలో నాని అమెరికాలో ప్రమోషన్ టూర్ చేయడం మరింత మెరుగైన నెంబర్లకు దోహదం చేసేలా ఉంది. దసరా కన్నా వేగంగా సెంచరీ కొట్టిన హిట్ 3కి అసలు పరీక్ష ఇవాళ సోమవారం నుంచి మొదలుకానుంది. ఎంత డ్రాప్ ఉంటుందనేది కీలకం కానుంది.
రాబోయే శుక్రవారం కొత్త రిలీజులు శ్రీవిష్ణు సింగిల్, సమంతా నిర్మించిన శుభం ఉన్నాయి. వీటి నుంచి ఎంత థ్రెట్ ఉంటుందనేది టాక్ మీద ఆధారపడి ఉంటుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి హడావిడి ఒకటి రెండు రోజులకే పరిమితం కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. ఏపీలో తీసుకున్న టికెట్ రేట్ల పెంపు హిట్ 3కి బుధవారంతో ముగుస్తుంది. సాధారణ ధరలతో హిట్ 3 పికప్ కావడం కీలకం. దర్శకుడు శైలేష్ కొలను ఇక్కడి ప్రమోషన్లు కొనసాగిస్తూ ఉండగా నాని, శ్రీనిధి శెట్టి యుఎస్ పబ్లిసిటీలో భాగమయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నూటా యాభై కోట్లకు కానుంది. ఇదంత సులభం కాదు కానీ చూడాలి ఎక్కడి దాకా వెళ్తుందో.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…