గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా ఉన్న పేరును కోలీవుడ్ బాగా చెడగొట్టుకుంది. గతంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఎంతోంమది గొప్ప దర్శకులు ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరుస్తున్నారు. అక్కడ కొత్త దర్శకులు కూడా అంతగా మెప్పించడం లేదు. సరికొత్త సినిమాలకు పట్టం కట్టి తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు సైతం ఇప్పుడు మామూలు చిత్రాలకే ఆహా ఓహో అని ఊగిపోవడం కనిపిస్తోంది. అవే చిత్రాలను మన వాళ్లు చూసి పెదవి విరుస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర తిప్పి కొడుతున్నారు. అజిత్, విజయ్ లాంటి టాప్ స్టార్లు చేసే సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
కానీ ఆ రొటీన్ మాస్ మసాలా సినిమాలనే వాళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. గత నెలలో వచ్చిన అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా సాధారణ చిత్రం. అయినా అది తమిళంలో బాగా ఆడింది. ఇక వర్తమానంలోకి వస్తే.. సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ చూసిన మన ప్రేక్షకులంతా బెంబేలెత్తిపోయారు. తెలుగు వారి దత్తపుత్రుడిగా భావించి సూర్య నుంచి ఓ సినిమా వస్తుందంటే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. కానీ అతను కూడా వరుసగా పేలవమైన సినిమాలతో నిరాశపరుస్తున్నాడు. ‘రెట్రో’ అతడి కమ్ బ్యాక్ అవుతుందన్న ఆశతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చుక్కలు చూపించాడు.
అసలు ఆ కథేంటో.. హీరో క్యారెక్టరేంటో.. ఆ సన్నివేశాలేంటో అర్థం కాక.. మినిమం ఎమోషన్ లేక రెండున్నర గంటల సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమైంది. దీంతో తొలి రోజే ‘రెట్రో’ తెలుగులో బకెట్ తన్నేసింది. రెండో రోజు నుంచి థియేటర్లు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఇక్కడ ఆ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. కానీ తమిళంలో మాత్రం ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. వసూళ్లు కూడా బాగున్నాయి. వీకెండ్ వరకు చూస్తే సినిమా హిట్ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు భాషల ప్రేక్షకుల అభిరుచిలో కొంత తేడా ఉండొచ్చు కానీ.. మరీ ఇంత వైరుధ్యం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…