Movie News

‘ఆచార్య’ రచ్చ.. చరణ్ లైన్లోకొచ్చాడు


టాలీవుడ్లో పేరున్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత షూటింగ్‌కు వెళ్తుంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే షూటింగ్‌లు జరపాలని ప్రయత్నించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఎంతకీ పున:ప్రారంభించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు. నవంబరు 4న షూటింగ్ అన్నారు కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు.

స్క్రిప్టులో మార్పులంటూ మీడియాలో గట్టిగా ప్రచారం జరగడంతో ఇంతకుముందు జరిగిన ‘కాపీ’ వివాదమే ఇందుక్కారణమా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ రచ్చ నడుస్తుండటంతో ఇది డ్యామేజింగ్ అనుకున్నారో ఏమో.. వెంటనే షూటింగ్ అప్‌డేట్ ఇచ్చేశారు. రామ్ చరణ్ అధినేతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటన చేసింది.

నవంబరు 9న ఆచార్య కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో ప్రకటించింది. అన్ని జాగ్రత్తల మధ్య షూటింగ్ జరగబోతోందని.. ఇది సుదీర్ఘ షెడ్యూల్ అని, ఇందులోనే సినిమాలో మేజర్ పోెర్షన్స్ పూర్తవుతాయని కూడా వెల్లడించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. అలాగే 2021 వేసవిలో ‘ఆచార్య’ సందడి చేయబోతున్న విషయాన్ని కూడా మరోసారి ధ్రువీకరించారు.

ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు రావడంతో మెగా అభిమానులు హమ్మయ్య అనుకుంటున్నారు. ఇక ‘ఆచార్య’ గురించి జరుగుతున్న నెగెటివ్ ప్రచారాలన్నింటికీ ఇంతటితో తెరపడ్డట్లే అనుకోవాలి. ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ నటించనున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌తో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చిరు నిర్విరామంగా పని చేసి ఈ సినిమాను ఈ ఏడాదే పూర్తి చేసేస్తాడని.. కొత్త ఏడాదిలో సమాంతరంగా లూసిఫర్, వేదాలం రీమేక్‌ల్లో నటిస్తాడని అంటున్నారు.

This post was last modified on November 4, 2020 11:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

9 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

21 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago