టాలీవుడ్లో పేరున్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత షూటింగ్కు వెళ్తుంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే షూటింగ్లు జరపాలని ప్రయత్నించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఎంతకీ పున:ప్రారంభించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు. నవంబరు 4న షూటింగ్ అన్నారు కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు.
స్క్రిప్టులో మార్పులంటూ మీడియాలో గట్టిగా ప్రచారం జరగడంతో ఇంతకుముందు జరిగిన ‘కాపీ’ వివాదమే ఇందుక్కారణమా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ రచ్చ నడుస్తుండటంతో ఇది డ్యామేజింగ్ అనుకున్నారో ఏమో.. వెంటనే షూటింగ్ అప్డేట్ ఇచ్చేశారు. రామ్ చరణ్ అధినేతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటన చేసింది.
నవంబరు 9న ఆచార్య కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో ప్రకటించింది. అన్ని జాగ్రత్తల మధ్య షూటింగ్ జరగబోతోందని.. ఇది సుదీర్ఘ షెడ్యూల్ అని, ఇందులోనే సినిమాలో మేజర్ పోెర్షన్స్ పూర్తవుతాయని కూడా వెల్లడించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. అలాగే 2021 వేసవిలో ‘ఆచార్య’ సందడి చేయబోతున్న విషయాన్ని కూడా మరోసారి ధ్రువీకరించారు.
ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు రావడంతో మెగా అభిమానులు హమ్మయ్య అనుకుంటున్నారు. ఇక ‘ఆచార్య’ గురించి జరుగుతున్న నెగెటివ్ ప్రచారాలన్నింటికీ ఇంతటితో తెరపడ్డట్లే అనుకోవాలి. ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ నటించనున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్తో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చిరు నిర్విరామంగా పని చేసి ఈ సినిమాను ఈ ఏడాదే పూర్తి చేసేస్తాడని.. కొత్త ఏడాదిలో సమాంతరంగా లూసిఫర్, వేదాలం రీమేక్ల్లో నటిస్తాడని అంటున్నారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…