ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. కానీ అతడికి అవకాశాలకైతే లోటు లేదు. ఏడాదిలో రెండు రిలీజ్లు ఉండేలా చూసుకుంటున్నాడు. చేతిలో రెండు మూడు సినిమాలైతే ఉంటున్నాయి. గత ఏడాది ‘లైలా’ మూవీతో గట్టి ఎదురు దెబ్బ తిన్న విశ్వక్.. ప్రస్తుతం ‘ఫంకీ’ అనే వెరైటీ టైటిల్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో పాటు శ్రీధర్ గంట అనే కొత్త దర్శకుడితో విశ్వక్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు. అది ఇంకా సెట్స్ మీదికి వెళ్లినట్లు లేదు.
ఈలోపే ఈ యంగ్ హీరోతో మరో సినిమా తెరపైకి వచ్చింది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ఈ సినిమాను నిర్మించబోతుండడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బాగా ఫేమస్ అయిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్.. విశ్వక్ హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు ‘కల్ట్’ అనే వెరైటీ టైటిల్ ఖాయం చేశారు. సోషల్ మీడియా కాలంలో ‘కల్ట్’ అనేది బాగా పాపులర్ మాట.
ఒకప్పుడు గొప్ప సినిమాలను ‘క్లాసిక్’ అనేవాళ్లు. ఇప్పుడు ‘కల్ట్’ అంటున్నారు. ఈ పేరుతో విశ్వక్ సినిమా చేయడం విశేషమే. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. తలసాని వారికి సినిమా నిర్మాణం కొత్తేమీ కాదు. శ్రీనివాస్ సోదరుడు శంకర్ యాదవ్ ఇప్పటికే ‘చిన్ని చిన్ని ఆశ’ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాడు. సాయికిరణ్.. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రాబోతోంది.
This post was last modified on May 2, 2025 7:52 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…