కరోనాను లైట్ తీసుకున్న చాలామంది ప్రముఖులు కూడా దానికి తలవంచి ప్రాణాలే కోల్పోయిన ఉదంతాలు చాలానే చూశాం. సినీ, రాజకీయ, వ్యాపార, కళా రంగాలకు చెందిన ఎంతోమంది కరోనా వల్ల అసువులు బాసారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుుడ రాజశేఖర్ కండిషన్ సీరియస్ అనగానే అందరిలో ఆందోళన నెలకొంది.
అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి విషమంగా మారినట్లు ఆయన భార్య జీవిత ఇప్పుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. రాజశేఖర్ ఆరోగ్యం గురించి ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వైద్యులు ఆయనను అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారని జీవిత తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు, ఆయనకు వెంటిలేటర్ పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. రాజశేఖర్కు బయటి నుంచి ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ అందించారు తప్ప.. గొంతు లోపల పెట్టే వెంటిలేటర్ ఎప్పుడూ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి చాలా విషమ స్థాయికి వెళ్లిన మాట మాత్రం వాస్తవమన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆ దశ నుంచి రాజశేఖర్ కోలుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నెమ్మదిగా బయటి నుంచి అందించే ఆక్సిజన్ను తగ్గిస్తున్నారని.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని.. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారన్న ఆశాభావంతో ఉన్నామని ఆమె వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అభిమానులు రాజశేఖర్పై ఎంతో ప్రేమ చూపించారని, ఆయన కోసం ప్రార్థించారని, వారి వల్లే ఆయన కోలుకుంటున్నారని చాలా ఎమోషనల్గా చెప్పారు జీవిత. ఆమెతో పాటు కూతుళ్లు శివాని, శివాత్మిక సైతం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2020 6:04 pm
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…