కరోనాను లైట్ తీసుకున్న చాలామంది ప్రముఖులు కూడా దానికి తలవంచి ప్రాణాలే కోల్పోయిన ఉదంతాలు చాలానే చూశాం. సినీ, రాజకీయ, వ్యాపార, కళా రంగాలకు చెందిన ఎంతోమంది కరోనా వల్ల అసువులు బాసారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుుడ రాజశేఖర్ కండిషన్ సీరియస్ అనగానే అందరిలో ఆందోళన నెలకొంది.
అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి విషమంగా మారినట్లు ఆయన భార్య జీవిత ఇప్పుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. రాజశేఖర్ ఆరోగ్యం గురించి ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వైద్యులు ఆయనను అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారని జీవిత తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు, ఆయనకు వెంటిలేటర్ పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. రాజశేఖర్కు బయటి నుంచి ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ అందించారు తప్ప.. గొంతు లోపల పెట్టే వెంటిలేటర్ ఎప్పుడూ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి చాలా విషమ స్థాయికి వెళ్లిన మాట మాత్రం వాస్తవమన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆ దశ నుంచి రాజశేఖర్ కోలుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నెమ్మదిగా బయటి నుంచి అందించే ఆక్సిజన్ను తగ్గిస్తున్నారని.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని.. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారన్న ఆశాభావంతో ఉన్నామని ఆమె వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అభిమానులు రాజశేఖర్పై ఎంతో ప్రేమ చూపించారని, ఆయన కోసం ప్రార్థించారని, వారి వల్లే ఆయన కోలుకుంటున్నారని చాలా ఎమోషనల్గా చెప్పారు జీవిత. ఆమెతో పాటు కూతుళ్లు శివాని, శివాత్మిక సైతం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2020 6:04 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…