కరోనాను లైట్ తీసుకున్న చాలామంది ప్రముఖులు కూడా దానికి తలవంచి ప్రాణాలే కోల్పోయిన ఉదంతాలు చాలానే చూశాం. సినీ, రాజకీయ, వ్యాపార, కళా రంగాలకు చెందిన ఎంతోమంది కరోనా వల్ల అసువులు బాసారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుుడ రాజశేఖర్ కండిషన్ సీరియస్ అనగానే అందరిలో ఆందోళన నెలకొంది.
అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి విషమంగా మారినట్లు ఆయన భార్య జీవిత ఇప్పుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. రాజశేఖర్ ఆరోగ్యం గురించి ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వైద్యులు ఆయనను అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారని జీవిత తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు, ఆయనకు వెంటిలేటర్ పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. రాజశేఖర్కు బయటి నుంచి ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ అందించారు తప్ప.. గొంతు లోపల పెట్టే వెంటిలేటర్ ఎప్పుడూ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి చాలా విషమ స్థాయికి వెళ్లిన మాట మాత్రం వాస్తవమన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆ దశ నుంచి రాజశేఖర్ కోలుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నెమ్మదిగా బయటి నుంచి అందించే ఆక్సిజన్ను తగ్గిస్తున్నారని.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని.. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారన్న ఆశాభావంతో ఉన్నామని ఆమె వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అభిమానులు రాజశేఖర్పై ఎంతో ప్రేమ చూపించారని, ఆయన కోసం ప్రార్థించారని, వారి వల్లే ఆయన కోలుకుంటున్నారని చాలా ఎమోషనల్గా చెప్పారు జీవిత. ఆమెతో పాటు కూతుళ్లు శివాని, శివాత్మిక సైతం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 4, 2020 6:04 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…