కరోనాను లైట్ తీసుకున్న చాలామంది ప్రముఖులు కూడా దానికి తలవంచి ప్రాణాలే కోల్పోయిన ఉదంతాలు చాలానే చూశాం. సినీ, రాజకీయ, వ్యాపార, కళా రంగాలకు చెందిన ఎంతోమంది కరోనా వల్ల అసువులు బాసారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుుడ రాజశేఖర్ కండిషన్ సీరియస్ అనగానే అందరిలో ఆందోళన నెలకొంది.
అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి విషమంగా మారినట్లు ఆయన భార్య జీవిత ఇప్పుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. రాజశేఖర్ ఆరోగ్యం గురించి ఆమె ఒక వీడియో ద్వారా అభిమానులకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో వైద్యులు ఆయనను అతి పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారని జీవిత తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు, ఆయనకు వెంటిలేటర్ పెట్టినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. రాజశేఖర్కు బయటి నుంచి ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టి ఆక్సిజన్ అందించారు తప్ప.. గొంతు లోపల పెట్టే వెంటిలేటర్ ఎప్పుడూ పెట్టలేదని ఆమె స్పష్టం చేశారు. ఒక దశలో రాజశేఖర్ పరిస్థితి చాలా విషమ స్థాయికి వెళ్లిన మాట మాత్రం వాస్తవమన్నారు. కానీ దేవుడి దయ వల్ల ఆ దశ నుంచి రాజశేఖర్ కోలుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం నెమ్మదిగా బయటి నుంచి అందించే ఆక్సిజన్ను తగ్గిస్తున్నారని.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని.. త్వరలోనే ఐసీయూ నుంచి బయటికి వస్తారన్న ఆశాభావంతో ఉన్నామని ఆమె వెల్లడించారు. ఈ కష్ట కాలంలో అభిమానులు రాజశేఖర్పై ఎంతో ప్రేమ చూపించారని, ఆయన కోసం ప్రార్థించారని, వారి వల్లే ఆయన కోలుకుంటున్నారని చాలా ఎమోషనల్గా చెప్పారు జీవిత. ఆమెతో పాటు కూతుళ్లు శివాని, శివాత్మిక సైతం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…