కొన్ని అరుదైన కలయికలు తెరమీద అంత సులభంగా జరగవు. వాటి కోసం సంవత్సరాలు లేదా దశాబ్దాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. అలాంటిదే నందమూరి బాలకృష్ణ, రజనీకాంత్ కాంబో. ఈ ఇద్దరూ కలిసి జైలర్ 2లో సందడి చేయడం ఖరారైనట్టే. చెన్నై వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్వరలోనే దీనికి సంబంధించిన షూట్ చేయబోతున్నారు. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ కు ఇచ్చిన ఎలివేషన్లు ఏ స్థాయిలో పేలాయో చూశాం. వాటిని మించిపోయేలా పవర్ ఫుల్ బ్లాక్ ఒకటి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడో ప్రత్యేకమైన విశేషం చెప్పుకోవాలి.
రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో స్వర్గీయ ఎన్టీఆర్ ‘టైగర్’లో నటించారు. ఇది 1979లో రిలీజయ్యింది. అమితాబ్ బచ్చన్ ఖూన్ పసినా రీమేక్ గా మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయడం, తెలుగుదేశం జయకేతనం ఎగరేయడంతో మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు. బాలకృష్ణతోనూ వెండితెర మీద రజినిని చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు దక్కలేదు. ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అన్నగారి వారసుడు బాలయ్యతో రజని చేతులు కలపడం అంటే స్పెషల్ మూమెంటే. వచ్చే ఏడాది విడుదలకు జైలర్ 2 రెడీ అవుతోంది. సంక్రాంతి ఆప్షన్ పరిశీలిస్తున్నారు.
ఇంకొక్క ఆసక్తికరమైన విషయం ఏంటంటే జైలర్ 2 తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ పలు సందర్భాల్లో నిర్మాణ సంస్థ ఇచ్చిన హింట్స్ దాదాపు ఖరారు చేసేశాయి. అంటే ముందు బాబాయ్ ని డైరెక్ట్ చేసి ఆ తర్వాత అబ్బాయిని దర్శకత్వం వహించే ఛాన్స్ నెల్సన్ కు దక్కబోతోంది. ఇంకా షూటింగ్ సగం కూడా కాకుండానే జైలర్ 2కి తెలుగు నుంచి భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. యాభై కోట్ల నుంచి నెంబర్ మొదలవుతోందని అంటున్నారు. అయితే కూలి రిలీజయ్యాకే జైలర్ 2 వ్యాపార వ్యవహారాలు మొదలవుతాయి.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…