విశ్వంభర విడుదల తేదీ విషయంలో ఎంత సందిగ్దత నెలకొందో చూస్తున్నాం. జూలై 24 రిలీజనే ప్రచారం కొద్దివారాలుగా జరుగుతోంది కానీ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవలే వదిలిన రామ రామ సాంగ్ బాగానే వెళ్తోంది. పాటలు వచ్చేస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఈ విజువల్ గ్రాండియర్ ని చూడొచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ తాజా పరిణామాలు కొత్త ఆప్షన్ ఎన్నుకునేలా చేస్తున్నాయని మెగా కాంపౌండ్ టాక్. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న పనులు మరింత ఆలస్యమయ్యే పక్షంలో సెప్టెంబర్ 25 విశ్వంభరని తీసుకొచ్చే ఆలోచన సీరియస్ గా జరుగుతోందట. ఆపై వారంలో దసరా పండగ ఉంటుంది.
ఇదంతా ఓకే కానీ సెప్టెంబర్ 25 ఇంతకు ముందే రెండు ప్యాన్ ఇండియా సినిమాలు లాక్ చేసుకున్నాయి. మొదటిది అఖండ 2 తాండవం. ఆ టైంకంతా అన్ని కార్యక్రమాలు పూర్తవ్వడం అనుమానంగానే ఉంది కాబట్టి 2026 సంక్రాంతి వైపు చూస్తున్నారని తాజా సమాచారం. ఎన్టీఆర్ నీల్ ఎలాగూ బరి నుంచి తప్పుకుంది కాబట్టి బాలయ్యకు పండగ సెంటిమెంట్ కలిసొస్తుంది. ఇక రెండోది సంబరాల ఏటిగట్టు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్ సెప్టెంబర్ 25 వస్తుందని నెలల క్రితమే చెప్పారు. ఒకవేళ విశ్వంభర వస్తానంటే మావయ్య కోసం మేనల్లుడు తప్పుకుంటాడు.
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ పైన చెప్పిందంతా సదరు ప్రొడక్షన్ టీమ్ లో జరుగుతున్న చర్చల సారాంశమే. విశ్వంభరకు సోలో రిలీజ్ తో పాటు క్వాలిటీ టైం కావాలి. పవన్ కళ్యాణ్ ఓజి కనక సెప్టెంబర్ 5 వచ్చే పక్షంలో ఇరవై రోజుల గ్యాప్ లో అన్నయ్య రావడం మంచిదే. కాకపోతే అక్టోబర్ మొదటి వారంలో కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కడై లాంటి ఇతర సినిమాలున్నాయి.ఆగస్ట్ పోటీ దృష్ట్యా ఆ నెలలో ఛాన్స్ లేదు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, జూలైలోనే వదలమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ సెప్టెంబర్ నే విశ్వంభర కోరుకుంటే మేనమామ కోసం మేనల్లుడు రిలీజ్ డేట్ త్యాగం చేయడం తప్పదు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…