ప్రయాణానికి అంత సౌకర్యంగా ఉండని ఎగుడుదిగుడుల ఎత్తయిన రోడ్డుని ఘాట్ సెక్షన్ గా పిలుస్తాం. విశ్వంభర జర్నీ అచ్చం ఇలాగే ఉంది. షూటింగ్ టైంలో సంక్రాంతి విడుదలని గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేశారు. పోనిలే మార్చిలో వచ్చి రంగస్థలంలాగా హిట్టు కొడుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఏప్రిల్ అయిపోయింది. మేలో ఛాన్స్ లేదు. జూన్ డౌటే. ఇక మిగిలింది జూలై. ఖచ్చితంగా ఆ నెలలోనే రావాలి. ఎందుకంటే ఆగస్ట్ లో వార్ 2, కూలి లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. పోటీ పడితే అనవసరమైన రిస్క్. సో వేరే ఆప్షన్ లేదు.
ఇంత స్పష్టంగా పరిమితులు కనిపిస్తున్నా విశ్వంభర నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడం లేదు. విఎఫ్ఎక్స్ పనులు బ్యాలన్స్ ఉండొచ్చు గాక. కానీ ఫలానా డెడ్ లైన్ పెట్టుకుంటే ఇంకా వేగంగా చేసే అవకాశం ఉంటుంది కదా. చేతిలో ఇంకో రెండు నెలలకు పైగానే సమయం ఉంది. హ్యాపీగా వాడుకోవచ్చు. ఎలాగూ ఒక ఆడియో సాంగ్ వదిలారు. గుడులకు పెన్ డ్రైవ్ లు ఇవ్వడం ద్వారా ప్రచారం వేగం పెంచారు. కానీ అసలైన రిలీజ్ డేట్ ఊసే లేదు. ఇదంతా ఓకే కానీ అనుష్క ఘాటీ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందో చూద్దాం. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ ప్యాన్ ఇండియా మూవీ కూడా ఏప్రిల్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
విశ్వంభర, ఘాటీ రెండు సినిమాలను నిర్మిస్తున్నది యువి క్రియేషన్సే. ముందు మెగా మూవీ సంగతి తేలితే అప్పుడు స్వీటీది డిసైడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే రెండింటి మధ్య తగినంత గ్యాప్ ఉంటే పబ్లిసిటీ చేసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. లేదూ మైత్రి లాగా రెండు తక్కువ టైంలోనో లేదా ఒకేసారి రిలీజ్ చేసే సాహసం చేస్తామంటే దానికైనా సిద్ధపడొచ్చు. అనుష్క వరకు షూటింగ్ అయిపోయిందని, ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. ముందు విశ్వంభర క్లారిటీ వచ్చేస్తే ఆ వెంటనే ఘాటీ డెసిషన్ వచ్చేస్తుందని అంతర్గత సమాచారం. చూద్దాం ఏం చేస్తారో.
This post was last modified on April 30, 2025 5:36 am
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…