ప్రయాణానికి అంత సౌకర్యంగా ఉండని ఎగుడుదిగుడుల ఎత్తయిన రోడ్డుని ఘాట్ సెక్షన్ గా పిలుస్తాం. విశ్వంభర జర్నీ అచ్చం ఇలాగే ఉంది. షూటింగ్ టైంలో సంక్రాంతి విడుదలని గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేశారు. పోనిలే మార్చిలో వచ్చి రంగస్థలంలాగా హిట్టు కొడుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఏప్రిల్ అయిపోయింది. మేలో ఛాన్స్ లేదు. జూన్ డౌటే. ఇక మిగిలింది జూలై. ఖచ్చితంగా ఆ నెలలోనే రావాలి. ఎందుకంటే ఆగస్ట్ లో వార్ 2, కూలి లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. పోటీ పడితే అనవసరమైన రిస్క్. సో వేరే ఆప్షన్ లేదు.
ఇంత స్పష్టంగా పరిమితులు కనిపిస్తున్నా విశ్వంభర నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడం లేదు. విఎఫ్ఎక్స్ పనులు బ్యాలన్స్ ఉండొచ్చు గాక. కానీ ఫలానా డెడ్ లైన్ పెట్టుకుంటే ఇంకా వేగంగా చేసే అవకాశం ఉంటుంది కదా. చేతిలో ఇంకో రెండు నెలలకు పైగానే సమయం ఉంది. హ్యాపీగా వాడుకోవచ్చు. ఎలాగూ ఒక ఆడియో సాంగ్ వదిలారు. గుడులకు పెన్ డ్రైవ్ లు ఇవ్వడం ద్వారా ప్రచారం వేగం పెంచారు. కానీ అసలైన రిలీజ్ డేట్ ఊసే లేదు. ఇదంతా ఓకే కానీ అనుష్క ఘాటీ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందో చూద్దాం. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ ప్యాన్ ఇండియా మూవీ కూడా ఏప్రిల్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
విశ్వంభర, ఘాటీ రెండు సినిమాలను నిర్మిస్తున్నది యువి క్రియేషన్సే. ముందు మెగా మూవీ సంగతి తేలితే అప్పుడు స్వీటీది డిసైడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే రెండింటి మధ్య తగినంత గ్యాప్ ఉంటే పబ్లిసిటీ చేసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. లేదూ మైత్రి లాగా రెండు తక్కువ టైంలోనో లేదా ఒకేసారి రిలీజ్ చేసే సాహసం చేస్తామంటే దానికైనా సిద్ధపడొచ్చు. అనుష్క వరకు షూటింగ్ అయిపోయిందని, ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. ముందు విశ్వంభర క్లారిటీ వచ్చేస్తే ఆ వెంటనే ఘాటీ డెసిషన్ వచ్చేస్తుందని అంతర్గత సమాచారం. చూద్దాం ఏం చేస్తారో.
This post was last modified on April 30, 2025 5:36 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…