ప్రయాణానికి అంత సౌకర్యంగా ఉండని ఎగుడుదిగుడుల ఎత్తయిన రోడ్డుని ఘాట్ సెక్షన్ గా పిలుస్తాం. విశ్వంభర జర్నీ అచ్చం ఇలాగే ఉంది. షూటింగ్ టైంలో సంక్రాంతి విడుదలని గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేశారు. పోనిలే మార్చిలో వచ్చి రంగస్థలంలాగా హిట్టు కొడుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తే అదీ జరగలేదు. ఇప్పుడేమో ఏప్రిల్ అయిపోయింది. మేలో ఛాన్స్ లేదు. జూన్ డౌటే. ఇక మిగిలింది జూలై. ఖచ్చితంగా ఆ నెలలోనే రావాలి. ఎందుకంటే ఆగస్ట్ లో వార్ 2, కూలి లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. పోటీ పడితే అనవసరమైన రిస్క్. సో వేరే ఆప్షన్ లేదు.
ఇంత స్పష్టంగా పరిమితులు కనిపిస్తున్నా విశ్వంభర నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించడం లేదు. విఎఫ్ఎక్స్ పనులు బ్యాలన్స్ ఉండొచ్చు గాక. కానీ ఫలానా డెడ్ లైన్ పెట్టుకుంటే ఇంకా వేగంగా చేసే అవకాశం ఉంటుంది కదా. చేతిలో ఇంకో రెండు నెలలకు పైగానే సమయం ఉంది. హ్యాపీగా వాడుకోవచ్చు. ఎలాగూ ఒక ఆడియో సాంగ్ వదిలారు. గుడులకు పెన్ డ్రైవ్ లు ఇవ్వడం ద్వారా ప్రచారం వేగం పెంచారు. కానీ అసలైన రిలీజ్ డేట్ ఊసే లేదు. ఇదంతా ఓకే కానీ అనుష్క ఘాటీ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చిందో చూద్దాం. పోస్ట్ ప్రొడక్షన్ వల్ల ఈ ప్యాన్ ఇండియా మూవీ కూడా ఏప్రిల్ రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
విశ్వంభర, ఘాటీ రెండు సినిమాలను నిర్మిస్తున్నది యువి క్రియేషన్సే. ముందు మెగా మూవీ సంగతి తేలితే అప్పుడు స్వీటీది డిసైడ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే రెండింటి మధ్య తగినంత గ్యాప్ ఉంటే పబ్లిసిటీ చేసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. లేదూ మైత్రి లాగా రెండు తక్కువ టైంలోనో లేదా ఒకేసారి రిలీజ్ చేసే సాహసం చేస్తామంటే దానికైనా సిద్ధపడొచ్చు. అనుష్క వరకు షూటింగ్ అయిపోయిందని, ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. ముందు విశ్వంభర క్లారిటీ వచ్చేస్తే ఆ వెంటనే ఘాటీ డెసిషన్ వచ్చేస్తుందని అంతర్గత సమాచారం. చూద్దాం ఏం చేస్తారో.
This post was last modified on April 30, 2025 5:36 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…