టాలీవుడ్లో చాలామంది హీరో హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందాం అనే ఆలోచనలోనే ఉంటారు. ఒక సినిమా హిట్ అయ్యాక వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఒప్పేసుకుని చకచకా సినిమాలు లాగించేస్తుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తారు. చాలా టైం తీసుకుని ఒక్కో సినిమా పూర్తి చేస్తారు. లేటుగా ప్రేక్షకులను పలకరించినా సరే.. సరైన సినిమాతోనే అయ్యుండాలని భావిస్తారు. అలాంటి హీరోల్లో అడివి శేష్ ఒకడు. ‘క్షణం’ దగ్గర్నుంచి అతను ఒక్కో సినిమాతో ఎలా పైకి ఎదుగుతున్నాడో తెలిసిందే. శేష్ సినిమా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలపడింది.
చివరగా 2022లో ‘హిట్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేష్. తర్వాత రెండేళ్లకు పైగా కాలం గడిచింది. కానీ ఇప్పటిదాకా తన కొత్త చిత్రం విడుదల కాలేదు. గూడఛారి సీక్వెల్ (జీ2), డెకాయిట్ చిత్రాల్లో నటిస్తున్న శేష్.. వాటి గురించి ఏ అప్డేట్స్ ఇవ్వడం లేదు. శేష్ బయట కనిపించడం తక్కువ. అలా కనిపించినపుడు కూడా తన సినిమాల అప్డేట్స్ ఏమీ ఇవ్వడు. తాజాగా ‘హిట్-3’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా శేష్ తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడిందేమీ లేదు. కానీ ఈ వేడుకలో వేరే వాళ్ల నోళ్ల నుంచి శేష్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బయటికి వచ్చాయి.
విశ్వక్సేన్ మాట్లాడుతూ.. శేష్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడని, అందులో ఒకటి జూన్లో రిలీజవుతుందని చెప్పాడు. శేష్ చిత్రాల్లో ముందు మొదలైంది ‘జీ2’నే కాబట్టి అదే జూన్లో రావచ్చని భావిస్తున్నారు. మరోవైపు ‘హిట్-3’ యాక్షన్ కొరియోగ్రాఫర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో శేష్ ఫైట్ ఉంటుందని పొరపాటున లీక్ ఇచ్చేశాడు. దీంతో ‘హిట్-3’లో శేష్ క్యామియో కన్ఫమ్ అయినట్లే. ఇందులో విశ్వక్ సైతం ఓ సన్నివేశంలో కనిపిస్తాడని గతంలో వార్తలొచ్చాయి. అదెంత వరకు నిజమో తెలియదు. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తి సినిమా చివర్లో మెరుస్తాడని ఇంతకుముందే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…