నిన్నటి తరం తెలుగు నటుడు రాజేష్ తనయురాలు ఐశ్వర్యా రాజేష్ తమిళంలో చాలామంచి పేరే సంపాదించింది. తండ్రి మరణానంతరం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య కుటుంబం.. అతి కష్టం మీద నిలదొక్కుకుంది. తాను కుటుంబాన్ని పోషించడానికి యుక్త వయసులో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడమే కాక సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఎంతో కష్టపడ్డట్లు ఓ ఈవెంట్లో ఐశ్వర్య వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
20 ఏళ్లకు అటు ఇటుగా వయసున్న సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా ‘కాకా ముట్టై’లో డీగ్లామరస్ రోల్ చేసి వారెవా అనిపించింది. అక్కడి నుంచి మొదలుపెట్టి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ కథానాయికగా నిలదొక్కుకుంది. ‘కనా’ పేరుతో ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ మధ్యే ‘భూమిక’ పేరుతో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టింది ఐశ్వర్యా రాజేష్.
ఐతే తెలుగులో ఐశ్వర్య నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రాలు మాత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం.. ఆమెకు ఇక్కడ మంచి అవకాశాలే దక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో పెద్ద హీరోల సరసన ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తోంది. అందులో ఒకటి.. ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు జోడీగా కొంత సమయం ఐశ్వర్య కనిపిస్తుందని అంటున్నారు. ఈ వార్త ప్రచారంలో ఉండగానే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు జోడీగా ఐశ్వర్య అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’లో పవన్ సరసన ఆమె నటిస్తుందని అంటున్నారు. ముందు ఈ పాత్రకు సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ ఆమె ఆ పాత్రకు ఓకే చెప్పలేదంటున్నారు. సాయిపల్లవికి రీమేక్ల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం అందుక్కారణం.
ఐతే మంచి నటి అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది కాబట్టి ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఆమె ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఒరిజినల్ చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. నిజంగా ఈ రెండు సినిమాల్లో ఐశ్వర్య నటించబోతున్నట్లయితే ఆమె దశ తిరగనున్నట్లే.
This post was last modified on November 3, 2020 10:34 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…