నిన్నటి తరం తెలుగు నటుడు రాజేష్ తనయురాలు ఐశ్వర్యా రాజేష్ తమిళంలో చాలామంచి పేరే సంపాదించింది. తండ్రి మరణానంతరం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డ ఐశ్వర్య కుటుంబం.. అతి కష్టం మీద నిలదొక్కుకుంది. తాను కుటుంబాన్ని పోషించడానికి యుక్త వయసులో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడమే కాక సినిమాల్లో అవకాశాల కోసం కూడా ఎంతో కష్టపడ్డట్లు ఓ ఈవెంట్లో ఐశ్వర్య వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
20 ఏళ్లకు అటు ఇటుగా వయసున్న సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా ‘కాకా ముట్టై’లో డీగ్లామరస్ రోల్ చేసి వారెవా అనిపించింది. అక్కడి నుంచి మొదలుపెట్టి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ కథానాయికగా నిలదొక్కుకుంది. ‘కనా’ పేరుతో ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ మధ్యే ‘భూమిక’ పేరుతో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాను మొదలుపెట్టింది ఐశ్వర్యా రాజేష్.
ఐతే తెలుగులో ఐశ్వర్య నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ చిత్రాలు మాత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతేనేం.. ఆమెకు ఇక్కడ మంచి అవకాశాలే దక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకేసారి రెండు భారీ చిత్రాల్లో పెద్ద హీరోల సరసన ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తోంది. అందులో ఒకటి.. ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు జోడీగా కొంత సమయం ఐశ్వర్య కనిపిస్తుందని అంటున్నారు. ఈ వార్త ప్రచారంలో ఉండగానే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్కు జోడీగా ఐశ్వర్య అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. మలయాళ బ్లాక్బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’లో పవన్ సరసన ఆమె నటిస్తుందని అంటున్నారు. ముందు ఈ పాత్రకు సాయిపల్లవి పేరు వినిపించింది. కానీ ఆమె ఆ పాత్రకు ఓకే చెప్పలేదంటున్నారు. సాయిపల్లవికి రీమేక్ల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవడం అందుక్కారణం.
ఐతే మంచి నటి అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది కాబట్టి ఐశ్వర్యను ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఆమె ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఒరిజినల్ చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. నిజంగా ఈ రెండు సినిమాల్లో ఐశ్వర్య నటించబోతున్నట్లయితే ఆమె దశ తిరగనున్నట్లే.
This post was last modified on November 3, 2020 10:34 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…