హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నాని హిట్ 3 ప్రమోషన్లను క్లైమాక్స్ కు తెచ్చేశాడు. ఆషామాషీగా ఎవరినో తీసుకొస్తే దీని రేంజ్ కు తగ్గట్టు ఉండదని భావించి ఏకంగా రాజమౌళినే ముఖ్యఅతిథిగా వచ్చేలా చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఈగ టైం నుంచి బాండింగ్ మొదలైన సంగతి తెలిసిందే. దాని తర్వాత ఈ కాంబో మళ్ళీ సాధ్యం కానప్పటికీ నాని అంటే జక్కన్నకు ప్రత్యేక మక్కువ ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగానే మజ్నులో ఒక చిన్న సన్నివేశంలో గెస్టుగా నిజ జీవిత పాత్రను పోషించడం అభిమానులు మర్చిపోలేరు. అందుకే నానికి జక్కన్న ఎప్పుడు వచ్చినా అంత ఆనందం కలుగుతుంది.
మరోసారి ఈ వేదిక సాక్షిగా నాని హిట్ 3 మీద తన నమ్మకాన్ని బహిర్గత పరుచుకున్నాడు. తన మాటల్లోనే క్లుప్తంగా చూద్దాం. “నా వెనుక రాజమౌళి ఉన్నారు. ముందు మీరున్నారు. కడుపులో తిరుపతి వెంకటేశ్వరస్వామి ప్రసాదముంది. మే 1 థియేటర్లలో మీకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయం. ఇక్కడ అనొచ్చో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది. కొత్త సినిమాలు రిలీజైనప్పుడు రాజమౌళి ఫ్యామిలీ ప్రీమియర్లకు వెళ్లి పంచుకునే అభిప్రాయాన్ని ఈసారి హిట్ 3 కోసం ఎదురు చూస్తున్నా. దాని కోసం ఏదైనా ప్రయాణం ప్లాన్ చేసుకుంటే జక్కన్న పాస్ పోర్ట్ లాక్కోవడానికి కూడా రెడీ”
ప్రసంగాన్ని కొనసాగిస్తూ “హిట్ 3 లో థాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి సక్సెస్ మీట్ లో మాత్రమే మాట్లాడగలను. కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పా. నా జడ్జ్ మెంట్ నిజమయ్యింది. ఇప్పుడు ప్యారడైజ్ వేరే నిర్మాత కాబట్టి తాకట్టు పెట్టలేను కానీ ఎస్ఎస్ఎంబి 29 అందామంటే ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే ప్రపంచమంతా చూసే సినిమా అది. ఒక మాస్ ఫిలింని క్రైమ్ జానర్ ని ముడిపెట్టడం కష్టం. కానీ హిట్ 3లో అది ఆర్గానిక్ గా కుదిరింది. మే 1 బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం”. సో చూశారుగా నాని నమ్మకం ఏ స్థాయిలో ఉందో. థియేటర్లను మళ్ళీ కళకళలాడించేలా హిట్ 3 గట్టిగానే కొట్టేలా ఉంది.
This post was last modified on April 27, 2025 10:55 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…