34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో హిట్ ముద్ర వేసుకుని క్షేమంగా బయట పడింది. మైనే ప్యార్ కియా, దిల్ లాంటి లవ్ స్టోరీస్ చూసిన కళ్ళతో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ జంట కామెడీని అప్పటి ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. అందుకే 5 కోట్ల 40 లక్షల వసూళ్లతో సోసో అనిపించుకుంది అయితే తర్వాత దీనికి కల్ట్ ముద్ర దక్కింది. హోమ్ వీడియో వచ్చాక క్యాసెట్లు, డివిడిలు, యూట్యూబ్, ఓటిటిలో చూసిన జనం కడుపుబ్బా ఎంజాయ్ చేశారు. క్లాసిక్ స్టేటస్ వచ్చేసింది. దీంతో రీ రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుందనుకున్నారు.
మొన్న శుక్రవారం మళ్ళీ విడుదలైన అందాజ్ అప్నా అప్నా వసూళ్లు తీసికట్టుగా ఉన్నాయి. మొదటిరోజు కేవలం 25 లక్షలు రాగా రెండో రోజు 30 లక్షలతో ఎదురీదుతోంది. నిర్మాణ సంస్థ చాలా ఖర్చు పెట్టి 4కె తో పాటు డాల్బీ సౌండ్ జత చేయించింది. మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్లు చేశారు. సల్మాన్, అమీర్ ఇద్దరూ ప్రత్యేకమైన బైట్స్ ఇచ్చారు. దీంతో సహజంగానే జనం ఎగబడతారనుకుంటే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాళ మహా అయితే ఇంకో పాతిక లక్షలు వస్తే గొప్పనేలా ఉంది. అది కూడా ముంబై లాంటి నగరాల్లో బుకింగ్స్ పర్వాలేదు కాబట్టి ఈ మాత్రం నెంబర్లు కనిపిస్తున్నాయి.
చూస్తుంటే సీనియర్ స్టార్ల ఇమేజ్ రీ రిలీజుల విషయంలో ఏమంత పని చేయడం లేదు కాబోలు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరూ డిజాస్టర్లలో ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఒకపక్క రెండు బ్లాక్ బస్టర్లు ఇస్తే వీళ్ళేమో వరస ఫ్లాపులతో ఉసురూమనిపించారు. అందాజ్ అప్నా అప్నా లాగే ఆ మధ్య గ్రాండ్ గా విడుదల చేసిన కరణ్ అర్జున్ సైతం జనాల తిరస్కారానికి గురయ్యింది. కహో నా ప్యార్ హై కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అసలు టైంలో సూపర్ ఫ్లాప్ గా నిలిచిన సనమ్ తేరి కసం, లైలా మజ్ను లాంటివి భారీ వసూళ్లు తేగా క్లాసిక్స్ మాత్రం ఇలా అవమానకర రీతిలో తోక ముడవడం అనూహ్య పరిణామం.
This post was last modified on April 27, 2025 5:05 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…