34 ఏళ్ళ క్రితం 1994లో విడుదలైన సినిమా అందాజ్ అప్నా అప్నా. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ ఉన్నంతలో హిట్ ముద్ర వేసుకుని క్షేమంగా బయట పడింది. మైనే ప్యార్ కియా, దిల్ లాంటి లవ్ స్టోరీస్ చూసిన కళ్ళతో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ జంట కామెడీని అప్పటి ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేకపోయారు. అందుకే 5 కోట్ల 40 లక్షల వసూళ్లతో సోసో అనిపించుకుంది అయితే తర్వాత దీనికి కల్ట్ ముద్ర దక్కింది. హోమ్ వీడియో వచ్చాక క్యాసెట్లు, డివిడిలు, యూట్యూబ్, ఓటిటిలో చూసిన జనం కడుపుబ్బా ఎంజాయ్ చేశారు. క్లాసిక్ స్టేటస్ వచ్చేసింది. దీంతో రీ రిలీజ్ చేస్తే బ్రహ్మాండమైన ఆదరణ దక్కుతుందనుకున్నారు.
మొన్న శుక్రవారం మళ్ళీ విడుదలైన అందాజ్ అప్నా అప్నా వసూళ్లు తీసికట్టుగా ఉన్నాయి. మొదటిరోజు కేవలం 25 లక్షలు రాగా రెండో రోజు 30 లక్షలతో ఎదురీదుతోంది. నిర్మాణ సంస్థ చాలా ఖర్చు పెట్టి 4కె తో పాటు డాల్బీ సౌండ్ జత చేయించింది. మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్లు చేశారు. సల్మాన్, అమీర్ ఇద్దరూ ప్రత్యేకమైన బైట్స్ ఇచ్చారు. దీంతో సహజంగానే జనం ఎగబడతారనుకుంటే థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇవాళ మహా అయితే ఇంకో పాతిక లక్షలు వస్తే గొప్పనేలా ఉంది. అది కూడా ముంబై లాంటి నగరాల్లో బుకింగ్స్ పర్వాలేదు కాబట్టి ఈ మాత్రం నెంబర్లు కనిపిస్తున్నాయి.
చూస్తుంటే సీనియర్ స్టార్ల ఇమేజ్ రీ రిలీజుల విషయంలో ఏమంత పని చేయడం లేదు కాబోలు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరూ డిజాస్టర్లలో ఉన్నారు. షారుఖ్ ఖాన్ ఒకపక్క రెండు బ్లాక్ బస్టర్లు ఇస్తే వీళ్ళేమో వరస ఫ్లాపులతో ఉసురూమనిపించారు. అందాజ్ అప్నా అప్నా లాగే ఆ మధ్య గ్రాండ్ గా విడుదల చేసిన కరణ్ అర్జున్ సైతం జనాల తిరస్కారానికి గురయ్యింది. కహో నా ప్యార్ హై కూడా అంతంత మాత్రంగానే ఆడింది. అసలు టైంలో సూపర్ ఫ్లాప్ గా నిలిచిన సనమ్ తేరి కసం, లైలా మజ్ను లాంటివి భారీ వసూళ్లు తేగా క్లాసిక్స్ మాత్రం ఇలా అవమానకర రీతిలో తోక ముడవడం అనూహ్య పరిణామం.
This post was last modified on April 27, 2025 5:05 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…