టాలీవుడ్లో కొత్త వాళ్లను బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళలో నాని ఒకడు. అతను ఎక్కువగా కొత్త, అప్కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తుంటాడు. హీరోయిన్లు, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్లను కూడా కొత్త వాళ్లనే పరిచయం చేస్తుంటాడు. అతను హీరోయిన్లను రిపీట్ చేయడం తక్కువ. నాని కొత్త చిత్రం ‘హిట్-3’లో కన్నడ అమ్మాయి, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఆమెతో నాని జత కట్టడం ఇదే తొలిసారి. శ్రీనిధిని ‘హిట్-3’కి ఎంపిక చేసింది దర్శకుడు శైలేష్ కొలను కాదట. నానినే స్వయంగా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట. అది అనుకోకుండా జరిగిందని స్వయంగా హీరోయిన్ శ్రీనిధినే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తాను తెలుగులో కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘తెలుసు కదా’ ముహూర్త వేడుకకు వచ్చిన నాని.. తనకు ఛాన్స్ ఇచ్చినట్లు శ్రీనిధి తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న సినిమా ‘తెలుసు కదా’. ఇందులో శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా కథానాయికగా నటిస్తోంది. నీరజకు నాని క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఆమె దర్శకురాలిగా పరిచయం అవుతున్న చిత్రం ముహూర్త వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఆ సందర్భంగా శ్రీనిధిని చూసి, మాట్లాడిన నాని.. తన పక్కన ఆమె మంచి పెయిర్ అవుతుందని భావించాడట. తర్వాత ‘హిట్-3’ మొదలు కాగానే ఆమెకే తన పక్కన హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడట. ఇలా అనుకోకుండా తాను ‘హిట్-3’లో భాగం అయ్యానని శ్రీనిధి చెప్పింది. విశేషం ఏంటంటే.. నాని ఏ సినిమా ముహూర్త వేడుకకు వెళ్లి శ్రీనిధిని తన చిత్రంలోకి తీసుకున్నాడో ఆ సినిమా ఇంకా విడుదలకు సిద్ధం కాలేదు. కానీ ‘హిట్-3’ ఈ లోపే పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మరి ‘హిట్-3’ శ్రీనిధికి తెలుగులో ఎలాంటి ఆరంభాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…