మూడేళ్లు కష్టపడితే రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన ఘనత గేమ్ ఛేంజర్ కే దక్కుతుంది. దర్శకుడు శంకర్ ని గుడ్డిగా నమ్మిన హీరోతో పాటు నిర్మాత దిల్ రాజుకి కోలుకోలేని షాక్ తగిలింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆర్థికంగా ఎస్విసికి ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తగిలేది. అయితే గేమ్ ఛేంజర్ కి కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రిలీజ్ కు ముందు మాట్లాడుతూ శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కు స్టోరీ ఇవ్వడం కన్నా గొప్ప గౌరవం ఏముంటుందనే తరహాలో కార్తీక్ గొప్పగా చెప్పుకున్నాడు
తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో మే 1 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గేమ్ చేంజర్ ప్రస్తావన వచ్చినప్పుడు మాట మార్చేశారు. తాను కేవలం వన్ లైన్ మాత్రమే ఇచ్చానని, గ్రౌండెడ్ గా ఉండే ఒక ఐఎఎస్ ఆఫీసర్ పాయింట్ తో సబ్జెక్టు ఇస్తే అది చాలా మార్పులకు లోనై, వేరే రచయితలు ఎవరెవరో అందులో భాగమై చివరికి వేరే అవుట్ ఫుట్ వచ్చిందని పేర్కొన్నాడు. అయినా ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో ముందే ఊహించలేం కాబట్టి, బాక్సాఫీస్ జయాపజయాలు మన కంట్రోల్ లో ఉండవనే తరహాలో కార్తీక్ సుబ్బరాజ్ ఒక టైపు నిర్వేదంతో టాపిక్ ని ముగించారు.
మరి ఇది మాట విడుదలకు ముందు ఎందుకు చెప్పలేదన్నది మెగా ఫ్యాన్స్ ప్రశ్న. కథ మొత్తం నాదే అన్న తరహాలో ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు ఫ్లాప్ అయ్యాక మాట మారిస్తే ఎలా అంటున్నారు. గేమ్ ఛేంజర్ మొత్తం శంకర్ కనుసన్నల్లోనే జరిగిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే ఒక దశలో ఆయన దిల్ రాజుతో సహా ఎవరి మాటా వినలేదనే టాక్ కూడా వచ్చింది. అలాంటప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పటికప్పుడు దాని గురించి తెలుసుకునే అవకాశం దొరికి ఉండకపోవచ్చు. సరే ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో పక్కన పెడితే కెరీర్ పరంగా చివరికి నష్టపోయింది రామ్ చరణే అన్నది అభిమానుల నుంచి వస్తున్న కామెంట్.
This post was last modified on April 24, 2025 9:44 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…