Movie News

నా ‘గేమ్’ కథను ‘ఛేంజ్’ చేశారు – రెట్రో దర్శకుడు

మూడేళ్లు కష్టపడితే రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన ఘనత గేమ్ ఛేంజర్ కే దక్కుతుంది. దర్శకుడు శంకర్ ని గుడ్డిగా నమ్మిన హీరోతో పాటు నిర్మాత దిల్ రాజుకి కోలుకోలేని షాక్ తగిలింది. అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆర్థికంగా ఎస్విసికి ఇంకా పెద్ద ఎదురు దెబ్బ తగిలేది. అయితే గేమ్ ఛేంజర్ కి కథ అందించింది కార్తీక్ సుబ్బరాజ్ అనే విషయం అందరికీ తెలిసిందే. రిలీజ్ కు ముందు మాట్లాడుతూ శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కు స్టోరీ ఇవ్వడం కన్నా గొప్ప గౌరవం ఏముంటుందనే తరహాలో కార్తీక్ గొప్పగా చెప్పుకున్నాడు

తాజాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో మే 1 విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో గేమ్ చేంజర్ ప్రస్తావన వచ్చినప్పుడు మాట మార్చేశారు. తాను కేవలం వన్ లైన్ మాత్రమే ఇచ్చానని, గ్రౌండెడ్ గా ఉండే ఒక ఐఎఎస్ ఆఫీసర్ పాయింట్ తో సబ్జెక్టు ఇస్తే అది చాలా మార్పులకు లోనై, వేరే రచయితలు ఎవరెవరో అందులో భాగమై చివరికి వేరే అవుట్ ఫుట్ వచ్చిందని పేర్కొన్నాడు. అయినా ఆడియన్స్ ఎలాంటి తీర్పు ఇస్తారో ముందే ఊహించలేం కాబట్టి, బాక్సాఫీస్ జయాపజయాలు మన కంట్రోల్ లో ఉండవనే తరహాలో కార్తీక్ సుబ్బరాజ్ ఒక టైపు నిర్వేదంతో టాపిక్ ని ముగించారు.

మరి ఇది మాట విడుదలకు ముందు ఎందుకు చెప్పలేదన్నది మెగా ఫ్యాన్స్ ప్రశ్న. కథ మొత్తం నాదే అన్న తరహాలో ప్రచారం చేసుకుని తీరా ఇప్పుడు ఫ్లాప్ అయ్యాక మాట మారిస్తే ఎలా అంటున్నారు. గేమ్ ఛేంజర్ మొత్తం శంకర్ కనుసన్నల్లోనే జరిగిన మాట వాస్తవం. ఆ మాటకొస్తే ఒక దశలో ఆయన దిల్ రాజుతో సహా ఎవరి మాటా వినలేదనే టాక్ కూడా వచ్చింది. అలాంటప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ ఎప్పటికప్పుడు దాని గురించి తెలుసుకునే అవకాశం దొరికి ఉండకపోవచ్చు. సరే ఎవరేం చేశారో ఎవరేం చేయలేదో పక్కన పెడితే కెరీర్ పరంగా చివరికి నష్టపోయింది రామ్ చరణే అన్నది అభిమానుల నుంచి వస్తున్న కామెంట్.

This post was last modified on April 24, 2025 9:44 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క్లాస్ పీకారు: పాక్ ప్రధానికి ఫోన్ చేసి అమెరికా

నిన్నటి వరకు భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని.. రెండు దేశాలు తమకు అత్యంత ముఖ్యమైన దేశాలని.. మిత్రదేశాలుగా…

14 minutes ago

శభష్ లోకేష్ – విదేశీయులతోనూ కొబ్బరికాయ కొట్టించారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించిన సంగతి…

44 minutes ago

సేఫ్ హౌస్ లోకి పారిపోయిన పాక్ ప్రధాని

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మొదలై రెండు రోజులు కూడా ముగియలేదు…అప్పుడే పాకిస్తాన్ తన అపజయాన్ని అంగీకరించే దిశగా సాగుతోంది.…

1 hour ago

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా…

1 hour ago

బుక్ మై షోలో ‘వీరమల్లు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొన్నేళ్ల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్న సినిమా.. హరిహర వీరమల్లు. పవన్…

3 hours ago

క్లాసిక్ సీక్వెల్ – రామ్ చరణ్ డిమాండ్

35 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరిని ఆస్వాదించడం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారని అడ్వాన్స్ బుకింగ్స్ తేటతెల్లం చేశాయి.…

4 hours ago