ఒక్క చిన్న టీజర్ తో సినిమా మీద విపరీతమైన బజ్ వచ్చేలా చేసిన ఘనత ఈ మధ్య కాలంలో దర్శకుడు బుచ్చిబాబుకే దక్కుతుంది. సరిగ్గా ఐపీఎల్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో సిక్సర్ కొట్టించే షాట్ ని పొందుపరిచి అది వైరలయ్యే స్థాయిలో చూపించిన విధానం ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కేవలం ఈ చిన్న వీడియోతోనే బిజినెస్ ఎంక్వయిరీలు మూడు నాలుగింతలు పెరిగాయంటే ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే పెద్ది ముందు అనుకున్నది చరణ్ కోసం కాదని, జూనియర్ ఎన్టీఆర్ కనే ప్రచారాలు ఆ మధ్య తిరిగాయి. దానికి బుచ్చిబాబు ఒక ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
పెద్ది వెనుక ఉన్న పెద్ద కథ వివరించాడు. అదేంటో చూద్దాం. “ఉప్పెన విడుదల సమయంలో కరోనా ఉంది. నా మొదటి సినిమా ఓటిటిలో వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందా. కానీ అదృష్టవశాత్తు థియేటర్లలో రిలీజై వసూళ్లతో పాటు అవార్డులు తీసుకొచ్చింది. నాకు మూలాలున్న కథలు అది కూడా గ్రామీణ నేపథ్యంలో రాసుకోవడం ఇష్టం. పెద్ది అయ్యాక ముందు సుకుమార్ గారికి వినిపించా. ఆయనే రామ్ చరణ్ పేరు రికమండ్ చేశారు. కాసేపు వింటారనుకున్న చరణ్ తుదికంటా శ్రద్ధగా విని నెరేషన్ అయిపోయాక క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా కార్యరూపం దాల్చింది”
“పెద్ది పాత్ర రాసుకోవడానికి ముందు నా హీరోకి ఈ పేరే పెట్టాలని పిఠాపురం రామ మందిరంలో ఉన్నప్పుడు సంకల్పించుకున్నాను. ఇంత త్వరగా అది నెరవేరడం చూస్తే అది భగవంతుడి ఆశీర్వాదమే అనిపిస్తుంది. నాకు భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. చరణ్ కు నాకు ఈ సారూప్యత మా బంధాన్ని మరింత దగ్గర చేసింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని కాల్పనికత జోడించి పెద్ది రాసుకున్నా. పెద్దిలో ప్రపంచమంతా మెచ్చుకున్న క్రికెట్ షాట్ కంపోజ్ చేసిన నవకాంత్ మాస్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు” సో ఇదన్న మాట పెద్ది బ్యాక్ స్టోరీ. చాలామంది అనుకున్నట్టు కాకుండా పెద్ది వెళ్ళింది నేరుగా చరణ్ దగ్గరికే.
This post was last modified on April 22, 2025 11:13 am
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…