ఒక్క చిన్న టీజర్ తో సినిమా మీద విపరీతమైన బజ్ వచ్చేలా చేసిన ఘనత ఈ మధ్య కాలంలో దర్శకుడు బుచ్చిబాబుకే దక్కుతుంది. సరిగ్గా ఐపీఎల్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో సిక్సర్ కొట్టించే షాట్ ని పొందుపరిచి అది వైరలయ్యే స్థాయిలో చూపించిన విధానం ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కేవలం ఈ చిన్న వీడియోతోనే బిజినెస్ ఎంక్వయిరీలు మూడు నాలుగింతలు పెరిగాయంటే ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే పెద్ది ముందు అనుకున్నది చరణ్ కోసం కాదని, జూనియర్ ఎన్టీఆర్ కనే ప్రచారాలు ఆ మధ్య తిరిగాయి. దానికి బుచ్చిబాబు ఒక ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
పెద్ది వెనుక ఉన్న పెద్ద కథ వివరించాడు. అదేంటో చూద్దాం. “ఉప్పెన విడుదల సమయంలో కరోనా ఉంది. నా మొదటి సినిమా ఓటిటిలో వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందా. కానీ అదృష్టవశాత్తు థియేటర్లలో రిలీజై వసూళ్లతో పాటు అవార్డులు తీసుకొచ్చింది. నాకు మూలాలున్న కథలు అది కూడా గ్రామీణ నేపథ్యంలో రాసుకోవడం ఇష్టం. పెద్ది అయ్యాక ముందు సుకుమార్ గారికి వినిపించా. ఆయనే రామ్ చరణ్ పేరు రికమండ్ చేశారు. కాసేపు వింటారనుకున్న చరణ్ తుదికంటా శ్రద్ధగా విని నెరేషన్ అయిపోయాక క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా కార్యరూపం దాల్చింది”
“పెద్ది పాత్ర రాసుకోవడానికి ముందు నా హీరోకి ఈ పేరే పెట్టాలని పిఠాపురం రామ మందిరంలో ఉన్నప్పుడు సంకల్పించుకున్నాను. ఇంత త్వరగా అది నెరవేరడం చూస్తే అది భగవంతుడి ఆశీర్వాదమే అనిపిస్తుంది. నాకు భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. చరణ్ కు నాకు ఈ సారూప్యత మా బంధాన్ని మరింత దగ్గర చేసింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని కాల్పనికత జోడించి పెద్ది రాసుకున్నా. పెద్దిలో ప్రపంచమంతా మెచ్చుకున్న క్రికెట్ షాట్ కంపోజ్ చేసిన నవకాంత్ మాస్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు” సో ఇదన్న మాట పెద్ది బ్యాక్ స్టోరీ. చాలామంది అనుకున్నట్టు కాకుండా పెద్ది వెళ్ళింది నేరుగా చరణ్ దగ్గరికే.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…