ఒక్క చిన్న టీజర్ తో సినిమా మీద విపరీతమైన బజ్ వచ్చేలా చేసిన ఘనత ఈ మధ్య కాలంలో దర్శకుడు బుచ్చిబాబుకే దక్కుతుంది. సరిగ్గా ఐపీఎల్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో సిక్సర్ కొట్టించే షాట్ ని పొందుపరిచి అది వైరలయ్యే స్థాయిలో చూపించిన విధానం ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కేవలం ఈ చిన్న వీడియోతోనే బిజినెస్ ఎంక్వయిరీలు మూడు నాలుగింతలు పెరిగాయంటే ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే పెద్ది ముందు అనుకున్నది చరణ్ కోసం కాదని, జూనియర్ ఎన్టీఆర్ కనే ప్రచారాలు ఆ మధ్య తిరిగాయి. దానికి బుచ్చిబాబు ఒక ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
పెద్ది వెనుక ఉన్న పెద్ద కథ వివరించాడు. అదేంటో చూద్దాం. “ఉప్పెన విడుదల సమయంలో కరోనా ఉంది. నా మొదటి సినిమా ఓటిటిలో వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందా. కానీ అదృష్టవశాత్తు థియేటర్లలో రిలీజై వసూళ్లతో పాటు అవార్డులు తీసుకొచ్చింది. నాకు మూలాలున్న కథలు అది కూడా గ్రామీణ నేపథ్యంలో రాసుకోవడం ఇష్టం. పెద్ది అయ్యాక ముందు సుకుమార్ గారికి వినిపించా. ఆయనే రామ్ చరణ్ పేరు రికమండ్ చేశారు. కాసేపు వింటారనుకున్న చరణ్ తుదికంటా శ్రద్ధగా విని నెరేషన్ అయిపోయాక క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా కార్యరూపం దాల్చింది”
“పెద్ది పాత్ర రాసుకోవడానికి ముందు నా హీరోకి ఈ పేరే పెట్టాలని పిఠాపురం రామ మందిరంలో ఉన్నప్పుడు సంకల్పించుకున్నాను. ఇంత త్వరగా అది నెరవేరడం చూస్తే అది భగవంతుడి ఆశీర్వాదమే అనిపిస్తుంది. నాకు భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. చరణ్ కు నాకు ఈ సారూప్యత మా బంధాన్ని మరింత దగ్గర చేసింది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని కాల్పనికత జోడించి పెద్ది రాసుకున్నా. పెద్దిలో ప్రపంచమంతా మెచ్చుకున్న క్రికెట్ షాట్ కంపోజ్ చేసిన నవకాంత్ మాస్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు” సో ఇదన్న మాట పెద్ది బ్యాక్ స్టోరీ. చాలామంది అనుకున్నట్టు కాకుండా పెద్ది వెళ్ళింది నేరుగా చరణ్ దగ్గరికే.
This post was last modified on April 22, 2025 11:13 am
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…