హరిహర వీరమల్లు విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. మే 9 వస్తుందా రాదానే క్లారిటీ ఇంకా టీమ్ నుంచి రాలేదు. ఆ మధ్య ఒక అఫీషియల్ పోస్టర్ వదిలాక మళ్ళీ అప్డేట్స్ లేవు. ఇంకో ఇరవై రోజులు మాత్రమే సమయం ఉండటంతో వాయిదా తప్పకపోవచ్చనే వార్త ఉన్న ఆసక్తిని మరింత తగ్గించేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టి మరోసారి ఓజి వైపు వెళ్తోంది. నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు సుజిత్ మేలో డేట్లు దొరుకుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పవన్ కనక ఇవ్వగలిగితే వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ బరిలో దింపాలనేది ప్రాధమికంగా ఉన్న ప్లాన్. కానీ అదంత ఈజీ కాదు.
ఎందుకంటే వీరమల్లు కోసం కనీసం నాలుగైదు రోజులు ఇవ్వలేకపోతున్న పవన్ తొలి ప్రాధాన్యం ఏఎం రత్నంకే. పైగా అమెజాన్ ప్రైమ్ నుంచి డెడ్ లైన్ ఉందన్న వార్తల నేపథ్యంలో మే మిస్సయినా జూన్ లో అయినా వీరమల్లు రిలీజ్ చేస్తేనే చాలా పెట్టుబడులు సేఫ్ అవుతాయి. అసలు బజ్ పెంచడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఇదే సమస్య ఓజికి కూడా ఉంది. నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ ప్రకారం 2025లోనే థియేట్రికల్ రిలీజ్ జరగాలట. కానీ సాధ్యాసాధ్యాలు విశ్లేషించుకుంటే అవుతుందా లేదానే అనుమానం వస్తుంది. పైగా నాలుగు నెలల గ్యాప్ లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలంటే నమ్మశక్యం కాని విషయం.
ఇంకో పాయింట్ ఉంది. ఓజిలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం డీ ఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నారట. అంటే ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీలో కుర్ర అజిత్ ని చూశాం కదా, అచ్చం అదే తరహాలో వింటేజ్ పవన్ కనిపించే కొన్ని సన్నివేశాలకు గాను సుజిత్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలిసింది. ఇది నిజమైన పక్షంలో ఇప్పుడు అనుకున్న టైం సరిపోదు. అప్పుడు నెట్ ఫ్లిక్స్ కి సర్దిచెప్పి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజిలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ లాంటి పెద్ద విలన్ గ్యాంగ్ ఉంది. సంగీతం గురించి తమన్ ఇప్పటికే ఓ రేంజ్ ఎలివేషన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.
This post was last modified on April 21, 2025 1:30 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…