Movie News

OG వ్యవహారం ఎప్పుడు తేలుతుంది

హరిహర వీరమల్లు విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. మే 9 వస్తుందా రాదానే క్లారిటీ ఇంకా టీమ్ నుంచి రాలేదు. ఆ మధ్య ఒక అఫీషియల్ పోస్టర్ వదిలాక మళ్ళీ అప్డేట్స్ లేవు. ఇంకో ఇరవై రోజులు మాత్రమే సమయం ఉండటంతో వాయిదా తప్పకపోవచ్చనే వార్త ఉన్న ఆసక్తిని మరింత తగ్గించేస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల దృష్టి మరోసారి ఓజి వైపు వెళ్తోంది. నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు సుజిత్ మేలో డేట్లు దొరుకుతాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పవన్ కనక ఇవ్వగలిగితే వేగంగా పూర్తి చేసి సెప్టెంబర్ బరిలో దింపాలనేది ప్రాధమికంగా ఉన్న ప్లాన్. కానీ అదంత ఈజీ కాదు.

ఎందుకంటే వీరమల్లు కోసం కనీసం నాలుగైదు రోజులు ఇవ్వలేకపోతున్న పవన్ తొలి ప్రాధాన్యం ఏఎం రత్నంకే. పైగా అమెజాన్ ప్రైమ్ నుంచి డెడ్ లైన్ ఉందన్న వార్తల నేపథ్యంలో మే మిస్సయినా జూన్ లో అయినా వీరమల్లు రిలీజ్ చేస్తేనే చాలా పెట్టుబడులు సేఫ్ అవుతాయి. అసలు బజ్ పెంచడమే పెద్ద సవాల్ గా మారుతోంది. ఇదే సమస్య ఓజికి కూడా ఉంది. నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ ప్రకారం 2025లోనే థియేట్రికల్ రిలీజ్ జరగాలట. కానీ సాధ్యాసాధ్యాలు విశ్లేషించుకుంటే అవుతుందా లేదానే అనుమానం వస్తుంది. పైగా నాలుగు నెలల గ్యాప్ లో రెండు పవన్ కళ్యాణ్ సినిమాలంటే నమ్మశక్యం కాని విషయం.

ఇంకో పాయింట్ ఉంది. ఓజిలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం డీ ఏజింగ్ టెక్నాలజీ వాడుతున్నారట. అంటే ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీలో కుర్ర అజిత్ ని చూశాం కదా, అచ్చం అదే తరహాలో వింటేజ్ పవన్ కనిపించే కొన్ని సన్నివేశాలకు గాను సుజిత్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలిసింది. ఇది నిజమైన పక్షంలో ఇప్పుడు అనుకున్న టైం సరిపోదు. అప్పుడు నెట్ ఫ్లిక్స్ కి సర్దిచెప్పి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజిలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్ లాంటి పెద్ద విలన్ గ్యాంగ్ ఉంది. సంగీతం గురించి తమన్ ఇప్పటికే ఓ రేంజ్ ఎలివేషన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

This post was last modified on April 21, 2025 1:30 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

6 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

10 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago