టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న చెక్కుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ టాలీవుడ్ లో మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల ఫస్ట్ లుక్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఆనాటి చరిత్రను ఆవిష్కరిస్తూనే తెరకెక్కిస్తోన్న ఈ కల్పిత కథలో తాజాగా మరో చరిత్రాత్మక ఘట్టం కూడా ఉండబోతోందని తెలుస్తోంది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన ‘జలియన్ వాలాబాగ్’ ఎపిసోడ్ ను ఈ సినిమాలో జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గుర్తుండిపోయే చేదు ఘటన జలియన్ వాలా బాగ్ ఉదంతం. భారతీయులపై జనరల్ డయ్యర్ అమానుషానికి నిదర్శనం ఆ దుర్ఘటన. ఆనాడు డయ్యర్ ఆదేశాలతో తెల్లదొరలు జరిపిన కాల్పుల్లో 1000 మంది భారతీయులు మరణించారు. ఈ ఘటనతోనే బ్రిటిషువారిని తరిమికొట్టాలన్నకసి భారతీయుల్లో పెరిగిందని చెబుతారు. ఈ రకంగా స్వాతంత్ర్య సంగ్రామాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనను ‘ఆర్ఆర్ఆర్’లో కళ్లకు కట్టినట్టు జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.
అయితే, వాస్తవానికి అల్లూరి, కొమరం భీమ్ లకథలకూ, జలియన్ వాలాబాగ్ ఘటనకు సంబంధం లేదు. ఆ మాటకొస్తే కొమరం భీమ్, అల్లూరి అసలు ఒక్కసారి కూడా కలవలేదు. అయితే, కల్పిత కథ కాబట్టి పిరియాడికల్ ఎపిసోడ్ కోసం జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని సినిమాలో చూపించబోతున్నారట. ఇది కల్పిత కథ అని చెబుతున్నప్పటికే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై కొందరు వివాదం రేపారు. ఈ నేపథ్యంలో ఈ జలియన్ వాలాబాగ్ ఎపిసోడ్ ఉందా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలవ వెయిట్ చేయక తప్పదు. ఒక వేళ ‘ఆర్ఆర్ఆర్’లో ఆ హిస్టారిక్ ఎపిసోడ్ ఉంటే మాత్రం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయం.
This post was last modified on November 2, 2020 3:52 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…