టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో జక్కన్న చెక్కుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ టాలీవుడ్ లో మరో బాహుబలి కానుందని అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల ఫస్ట్ లుక్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
ఆనాటి చరిత్రను ఆవిష్కరిస్తూనే తెరకెక్కిస్తోన్న ఈ కల్పిత కథలో తాజాగా మరో చరిత్రాత్మక ఘట్టం కూడా ఉండబోతోందని తెలుస్తోంది. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన ‘జలియన్ వాలాబాగ్’ ఎపిసోడ్ ను ఈ సినిమాలో జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.
భారత స్వాతంత్ర్య పోరాటంలో గుర్తుండిపోయే చేదు ఘటన జలియన్ వాలా బాగ్ ఉదంతం. భారతీయులపై జనరల్ డయ్యర్ అమానుషానికి నిదర్శనం ఆ దుర్ఘటన. ఆనాడు డయ్యర్ ఆదేశాలతో తెల్లదొరలు జరిపిన కాల్పుల్లో 1000 మంది భారతీయులు మరణించారు. ఈ ఘటనతోనే బ్రిటిషువారిని తరిమికొట్టాలన్నకసి భారతీయుల్లో పెరిగిందని చెబుతారు. ఈ రకంగా స్వాతంత్ర్య సంగ్రామాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనను ‘ఆర్ఆర్ఆర్’లో కళ్లకు కట్టినట్టు జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.
అయితే, వాస్తవానికి అల్లూరి, కొమరం భీమ్ లకథలకూ, జలియన్ వాలాబాగ్ ఘటనకు సంబంధం లేదు. ఆ మాటకొస్తే కొమరం భీమ్, అల్లూరి అసలు ఒక్కసారి కూడా కలవలేదు. అయితే, కల్పిత కథ కాబట్టి పిరియాడికల్ ఎపిసోడ్ కోసం జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని సినిమాలో చూపించబోతున్నారట. ఇది కల్పిత కథ అని చెబుతున్నప్పటికే ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై కొందరు వివాదం రేపారు. ఈ నేపథ్యంలో ఈ జలియన్ వాలాబాగ్ ఎపిసోడ్ ఉందా లేదా అన్నది తేలాలంటే మరి కొంతకాలవ వెయిట్ చేయక తప్పదు. ఒక వేళ ‘ఆర్ఆర్ఆర్’లో ఆ హిస్టారిక్ ఎపిసోడ్ ఉంటే మాత్రం ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఖాయం.
This post was last modified on November 2, 2020 3:52 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…