Movie News

‘ఏమాయ చేసావె’లో దారుణంగా నటించా-సమంత

సమంత కెరీర్లో ఎన్నో సినిమాలు చేసింది కానీ.. ‘ఏమాయ చేసావె’ తన అభిమానులకు చాలా ప్రత్యేకం. దాని కంటే ముందు తమిళంలో ఓ సినిమా చేసినా సరే.. ‘ఏమాయ చేసావె’లో ఆమె రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా క్లాసిక్‌గా నిలిచిపోవడంలో సమంత పాత్ర కీలకం. హీరోయిన్ని అంత అందంగా, అపురూపంగా చూపించిన చిత్రాలు అరుదని చెప్పొచ్చు. నాగచైతన్యతో సామ్ కెమిస్ట్రీ అద్భుతంగా పండి తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చింది. సమంతకు సంబంధించి ఆ సినిమాలో ప్రతిదీ స్పెషలే. కానీ సామ్‌కు మాత్రం ఇప్పుడు ఆ సినిమాను చూస్తే సిగ్గుగా అనిపిస్తుందట.

అందులో బాగా నటించలేదనే ఫీలింగ్ కలుగుతుందట. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘శుభం’కు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నటిగా నేను కెరీర్ మొదలుపెట్టినపుడు నటన గురించి నాకు పెద్దగా తెలియదు. నేను నటించిన తొలి రెండు చిత్రాలను చూసుకుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఏమాయ చేసావెలో కూడా దారుణంగా నటించాననే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా బాగా నటించాల్సింది కదా అనిపిస్తుంది.

కానీ నేను ప్రొడ్యూస్ చేసిన ‘శుభం’ సినిమాలో చేసిన నటులు అలా కాదు. తొలి సినిమానే అయినా అందరూ చాలా బాగా నటించారు. అందరూ కొత్త వాళ్లే అయినా తడబడకుండా యాక్ట్ చేశారు. వారి పెర్ఫామెన్స్ నన్నెంతగానో ఆకట్టుకుంది’’ అని సామ్ చెప్పింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కంటెంట్‌కు పెద్ద పీట వేస్తారని.. మనసుకు హత్తుకునే కంటెంట్‌తో తెరకెక్కిన ‘శుభం’ చిత్రాన్ని వాళ్లు ఆదరిస్తారని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది. నిర్మాతగా మారడంపై స్పందిస్తూ తనకు సవాళ్లను స్వీకరించడం ఇష్టమని సమంత పేర్కొంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు.

This post was last modified on April 20, 2025 5:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

1 hour ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 hour ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

1 hour ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

4 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

6 hours ago