వెనకటికో పాత కథ ఉంది. కష్టాలతో విసిగి వేసారిపోయిన ఒకడికి బంగారు బాతు దొరుకుతుంది. దాని లక్షణం ఏంటంటే రోజుకో బంగారు గుడ్డు టంచనుగా ఇస్తుంది. దాన్ని అమ్ముకుని కుటుంబంతో దర్జాగా బ్రతుకుతూ రోజులు గడిపేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఓ రోజు వాడికో పిచ్చి ఆలోచన వస్తుంది. రోజుకో బంగారు గుడ్డు ఇచ్చే బాతు లోపల ఇంకెంత బంగారం ఉందో, ఒకేసారి కోసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పని చేయాల్సిన అవసరం ఉండదు కదా అనుకుంటాడు. క్షణం ఆలస్యం చేయకుండా కత్తి తీసుకుని బాతుని చంపేసి పొట్ట లోపల చూస్తే మాంసం తప్ప ఏముండదు. దీంతో తప్పు తెలుసుకుని ఘొల్లుమంటాడు.
ఇప్పుడీ చిట్టి స్టోరీ చెప్పడానికి కారణం మహేష్ బాబు అభిమానుల ఎమోషన్లు. పాత రీ రిలీజులను వాళ్ళు ఆదరిస్తున్న వైనం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల అత్యాశకు తెరతీసి సమయం సందర్భంగా లేకుండా వరసగా థియేటర్లలో వదులుతూ వాటి విలువను తగ్గించేస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ వారం ఒక్కడు, అంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని విడుదల చేయడం చూశాం. వచ్చే వారం ఏప్రిల్ 26 భరత్ అనే నేను వస్తుండగా ఆపై నెల మే 30 ఖలేజా, మే 31 అతిథిలను వరుసగా ప్లాన్ చేశారు. ఎంత కృష్ణ పుట్టినరోజు అయితే మరీ ఒకేసారి రెండు అంటే సెలబ్రేషన్స్ పరంగా ఫ్యాన్స్ మీద చాలా భారం పడుతుంది. అతిథి ఎప్పుడో ప్లాన్ చేసింది కానీ ఖలేజాని హఠాత్తుగా తీసుకొచ్చారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అభిమానుల ఎమోషన్లు చాలా సున్నితమైనవి. వాటిని ఖరీదుతో కొనలేం. కానీ వాళ్ళ స్థోమతకు మించి ఖర్చు పెట్టించడం సబబు కాదనేది వాస్తవం. ఏదో ఏడాదికి ఒకటి రెండు అంటే సరే. చేసిన ఇరవై ఎనిమిది సినిమాల్లో ఆరేడు ఒకే సంవత్సరంలో విడుదల చేస్తే వాటి వేల్యూ ఏమవుతుంది. ఫ్యాన్స్ పర్సులు చిల్లులు పడటం తప్ప జరిగేది ఏముంది. చూడకుండా ఉండలేని వాళ్ళ బలహీనతను ఇంతగా క్యాష్ చేసుకోవడానికి ఎందుకు ఆరాటపడాలనేదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం దొరికే లోపే టక్కరి దొంగ, నిజం, రాజకుమారుడు అంటూ మరికొన్ని రెడీ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…