Movie News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ వ‌చ్చాడ‌హో…

క‌రోనా కార‌ణంగా ఐదారు నెల‌ల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి టాలీవుడ్లో. ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్లో షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం ముందుగా సెట్స్ మీదికి వెళ్లింది. దీంతో అప్ప‌టిదాకా భ‌య‌ప‌డుతున్న మిగ‌తా చిత్రాల బృందాలు కూడా ఒక్కొక్క‌టిగా షూటింగ్‌కు వెళ్లాయి. రాజ‌మౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సైతం గ‌త నెల‌లోనే షూటింగ్ పునఃప్రారంభించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఐతే మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం షూటింగ్‌కు వెళ్ల‌డంలో ఆల‌స్యం చేశారు. ఇదిగో అదిగో అనుకుంటూనే అక్టోబ‌రంతా గ‌డిపేశారు. ఐతే ఎట్ట‌కేలకు మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ కూడా మేక‌ప్ వేసుకునే టైం వ‌చ్చేసింది.

చిరంజీవి నవంబ‌రు 4న ఆచార్య‌కు షూటింగ్‌కు హాజ‌రు కాబోతున్న‌ట్లు చెబుతుండ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక‌టో తారీఖునే సెట్స్‌లోకి అడుగు పెట్టేశాడు. ఆదివారం అన్న‌పూర్ణ స్టూడియోలో ప‌వ‌న్ షూటింగ్‌కు వ‌చ్చాడు. గుబురు గ‌డ్డాన్ని కొంచెం త‌గ్గించుకుని లాయ‌ర్ గెట‌ప్‌లో షూటింగ్‌కు హాజ‌ర‌య్యాడ‌ట ప‌వ‌న్. సినిమాలో అత్యంత కీల‌క‌మైన, కోర్టు నేప‌థ్యంలో వ‌చ్చే భావోద్వేగ స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ చిత్రీక‌రిస్తున్నట్లు స‌మాచారం.

అన్ని ర‌కాల క‌రోనా జాగ్ర‌త్త‌ల మ‌ధ్య‌ త‌క్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ జ‌రుగుతోంద‌ట‌. ప‌వ‌న్ నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొని ఈ సినిమాను పూర్తి చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. దీని త‌ర్వాత వ‌చ్చే నెల‌లో క్రిష్ సినిమా మీదికి వెళ్లిపోతాడ‌ట‌. ప‌వ‌న్ తిరిగి షూటింగ్‌కు వ‌చ్చాడ‌న్న వార్త అభిమానుల్లో హుషారు నింపేదే.

This post was last modified on November 2, 2020 10:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago