కరోనా కారణంగా ఐదారు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి టాలీవుడ్లో. ఎట్టకేలకు సెప్టెంబర్లో షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం ముందుగా సెట్స్ మీదికి వెళ్లింది. దీంతో అప్పటిదాకా భయపడుతున్న మిగతా చిత్రాల బృందాలు కూడా ఒక్కొక్కటిగా షూటింగ్కు వెళ్లాయి. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సైతం గత నెలలోనే షూటింగ్ పునఃప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.
ఐతే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగ్కు వెళ్లడంలో ఆలస్యం చేశారు. ఇదిగో అదిగో అనుకుంటూనే అక్టోబరంతా గడిపేశారు. ఐతే ఎట్టకేలకు మెగా బ్రదర్స్ ఇద్దరూ కూడా మేకప్ వేసుకునే టైం వచ్చేసింది.
చిరంజీవి నవంబరు 4న ఆచార్యకు షూటింగ్కు హాజరు కాబోతున్నట్లు చెబుతుండగా.. పవన్ కళ్యాణ్ ఒకటో తారీఖునే సెట్స్లోకి అడుగు పెట్టేశాడు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో పవన్ షూటింగ్కు వచ్చాడు. గుబురు గడ్డాన్ని కొంచెం తగ్గించుకుని లాయర్ గెటప్లో షూటింగ్కు హాజరయ్యాడట పవన్. సినిమాలో అత్యంత కీలకమైన, కోర్టు నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు వేణు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
అన్ని రకాల కరోనా జాగ్రత్తల మధ్య తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ జరుగుతోందట. పవన్ నిర్విరామంగా షూటింగ్లో పాల్గొని ఈ సినిమాను పూర్తి చేయబోతున్నట్లు చెబుతున్నారు. దీని తర్వాత వచ్చే నెలలో క్రిష్ సినిమా మీదికి వెళ్లిపోతాడట. పవన్ తిరిగి షూటింగ్కు వచ్చాడన్న వార్త అభిమానుల్లో హుషారు నింపేదే.
This post was last modified on November 2, 2020 10:19 am
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…