కరోనా కారణంగా ఐదారు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి టాలీవుడ్లో. ఎట్టకేలకు సెప్టెంబర్లో షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రం ముందుగా సెట్స్ మీదికి వెళ్లింది. దీంతో అప్పటిదాకా భయపడుతున్న మిగతా చిత్రాల బృందాలు కూడా ఒక్కొక్కటిగా షూటింగ్కు వెళ్లాయి. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ సైతం గత నెలలోనే షూటింగ్ పునఃప్రారంభించుకున్న సంగతి తెలిసిందే.
ఐతే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగ్కు వెళ్లడంలో ఆలస్యం చేశారు. ఇదిగో అదిగో అనుకుంటూనే అక్టోబరంతా గడిపేశారు. ఐతే ఎట్టకేలకు మెగా బ్రదర్స్ ఇద్దరూ కూడా మేకప్ వేసుకునే టైం వచ్చేసింది.
చిరంజీవి నవంబరు 4న ఆచార్యకు షూటింగ్కు హాజరు కాబోతున్నట్లు చెబుతుండగా.. పవన్ కళ్యాణ్ ఒకటో తారీఖునే సెట్స్లోకి అడుగు పెట్టేశాడు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో పవన్ షూటింగ్కు వచ్చాడు. గుబురు గడ్డాన్ని కొంచెం తగ్గించుకుని లాయర్ గెటప్లో షూటింగ్కు హాజరయ్యాడట పవన్. సినిమాలో అత్యంత కీలకమైన, కోర్టు నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు వేణు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
అన్ని రకాల కరోనా జాగ్రత్తల మధ్య తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో షూటింగ్ జరుగుతోందట. పవన్ నిర్విరామంగా షూటింగ్లో పాల్గొని ఈ సినిమాను పూర్తి చేయబోతున్నట్లు చెబుతున్నారు. దీని తర్వాత వచ్చే నెలలో క్రిష్ సినిమా మీదికి వెళ్లిపోతాడట. పవన్ తిరిగి షూటింగ్కు వచ్చాడన్న వార్త అభిమానుల్లో హుషారు నింపేదే.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…