విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద డిజాస్టర్లు అయ్యాయో తెలిసిందే. అంతకుముందు కూడా విజయ్ కొన్ని ఫెయిల్యూర్లు చూశాడు కానీ.. ఈ చిత్రాలు అతడి ఫాలోయింగ్, మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపాయి. తన మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. ఇలాంటి స్థితిలో అతను సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి సక్సెస్ ఫుల్ సంస్థలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ‘కింగ్డమ్’ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. విజయ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, పెద్ద స్పాన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఆ మధ్య రిలీజైన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచింది. ఐతే ఆ టీజర్ వచ్చాక సినిమా గురించి ఏ అప్డేట్ లేదు. విడుదలకు ఇంకో నెలన్నరే సమయం ఉండగా.. టీం సైలెన్స్ మెయింటైన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ‘కింగ్డమ్’ మేకర్స్ ప్రకటించినట్లు మే 30న రాదని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా నుంచి ఈ సమయానికి పాటలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాల్సింది. సినిమాను వార్తల్లో నిలబెట్టేలా ప్రమోషన్ల హడావుడి మొదలు కావాల్సింది.
కానీ టీం నుంచి అస్సలు సౌండ్ లేదు. ఇదిలా ఉండగా చిత్రీకరణ ఇంకా చాలా పెండింగ్ ఉందని.. కాబట్టి సినిమాను వాయిదా వేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని.. వాయిదా వేస్తున్నట్లయితే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని విజయ్ అభిమానులు నిర్మాత నాగవంశీని డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఆయన మాత్రం సినిమా వాయిదా పడదనే సన్నిహితులతో అంటున్నారట. ఆ విషయాన్ని ఏదో ఒక అప్డేట్ ద్వారా కన్ఫమ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on April 14, 2025 2:29 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…