దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద కూడా భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్ పాత్రకు జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో అజయ్ దేవగణ్ పాత్రకు జోడీగా శ్రియ కనిపిస్తుందని అంటున్నారు.
ఈ ముగ్గురూ కాక ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్కు జోడీగా మరో అమ్మాయి కూడా కనిపించనుందట. ఆ పాత్ర తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి పేరు సంపాదించిన ఐశ్వర్యా రాజేష్ను వరించినట్లు సమాచారం.
తారక్ చేస్తున్నది గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్ర అన్న సంగతి తెలిసిందే. పాత్ర ప్రారంభ దశలో అతడికి మరదలి పాత్రలో ఓ గిరిజన యువతే కనిపించాల్సి ఉంటుందట. ఆ పాత్రకు ఐశ్వర్యను ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఈ పాత్ర పరిణామం చెందాక బ్రిటిష్ యువతితో ప్రేమలో పడేలా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
గిరిజన యువతి పాత్రకు ఐశ్వర్యా రాజేష్ పక్కాగా సూటవ్వడమే కాదు.. దక్షిణాది అన్ని భాషల వాళ్లకూ ఆమె పరిచయం ఉండటం సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నాడట రాజమౌళి. త్వరలోనే ఐశ్వర్య ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతోందట. అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. ముందు భీమ్ పాత్ర టీజర్ విజువల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. ఇంకో మూడు నెలల పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది. త్వరలోనే ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కు రానుంది.
This post was last modified on November 1, 2020 6:35 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…