Movie News

‘ఆర్ఆర్ఆర్’లో ఇంకో హీరోయిన్?

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద కూడా భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్ పాత్రకు జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో అజయ్ దేవగణ్ పాత్రకు జోడీగా శ్రియ కనిపిస్తుందని అంటున్నారు.

ఈ ముగ్గురూ కాక ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్‌‌కు జోడీగా మరో అమ్మాయి కూడా కనిపించనుందట. ఆ పాత్ర తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి పేరు సంపాదించిన ఐశ్వర్యా రాజేష్‌ను వరించినట్లు సమాచారం.

తారక్ చేస్తున్నది గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్ర అన్న సంగతి తెలిసిందే. పాత్ర ప్రారంభ దశలో అతడికి మరదలి పాత్రలో ఓ గిరిజన యువతే కనిపించాల్సి ఉంటుందట. ఆ పాత్రకు ఐశ్వర్యను ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఈ పాత్ర పరిణామం చెందాక బ్రిటిష్ యువతితో ప్రేమలో పడేలా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

గిరిజన యువతి పాత్రకు ఐశ్వర్యా రాజేష్ పక్కాగా సూటవ్వడమే కాదు.. దక్షిణాది అన్ని భాషల వాళ్లకూ ఆమె పరిచయం ఉండటం సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నాడట రాజమౌళి. త్వరలోనే ఐశ్వర్య ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతోందట. అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. ముందు భీమ్ పాత్ర టీజర్ విజువల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. ఇంకో మూడు నెలల పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది. త్వరలోనే ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు రానుంది.

This post was last modified on November 1, 2020 6:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

1 hour ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

2 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

2 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

5 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

6 hours ago