దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద కూడా భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పున:ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. తారక్ పాత్రకు జోడీగా బ్రిటిష్ నటి ఒలీవియా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో అజయ్ దేవగణ్ పాత్రకు జోడీగా శ్రియ కనిపిస్తుందని అంటున్నారు.
ఈ ముగ్గురూ కాక ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో తారక్కు జోడీగా మరో అమ్మాయి కూడా కనిపించనుందట. ఆ పాత్ర తెలుగమ్మాయే అయినప్పటికీ తమిళంలో మంచి పేరు సంపాదించిన ఐశ్వర్యా రాజేష్ను వరించినట్లు సమాచారం.
తారక్ చేస్తున్నది గిరిజన వీరుడు కొమరం భీమ్ పాత్ర అన్న సంగతి తెలిసిందే. పాత్ర ప్రారంభ దశలో అతడికి మరదలి పాత్రలో ఓ గిరిజన యువతే కనిపించాల్సి ఉంటుందట. ఆ పాత్రకు ఐశ్వర్యను ఓకే చేసినట్లు చెబుతున్నారు. ఈ పాత్ర పరిణామం చెందాక బ్రిటిష్ యువతితో ప్రేమలో పడేలా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
గిరిజన యువతి పాత్రకు ఐశ్వర్యా రాజేష్ పక్కాగా సూటవ్వడమే కాదు.. దక్షిణాది అన్ని భాషల వాళ్లకూ ఆమె పరిచయం ఉండటం సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నాడట రాజమౌళి. త్వరలోనే ఐశ్వర్య ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతోందట. అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. ముందు భీమ్ పాత్ర టీజర్ విజువల్స్ తీసుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతోంది. ఇంకో మూడు నెలల పాటు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది. త్వరలోనే ఆలియా భట్ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కు రానుంది.
This post was last modified on November 1, 2020 6:35 pm
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…
ఇప్పటి జనరేషన్ కు పరిచయం లేదు కానీ నవీన్ వడ్డే హీరోగా ఒకప్పుడు మంచి మార్కెట్ ఎంజాయ్ చేశాడు. పెళ్లి,…
కెరీర్ ఆరంభం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన విజయ్ సేతుపతి.. ఇప్పుడు ఎంత పెద్ద రేంజికి ఎదిగిపోయాడో తెలిసిందే.…
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…