ఇంకో పద్దెనిమిది రోజుల్లో హిట్ 3 ది థర్డ్ కేస్ విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2 గంటల 35 నిమిషాల నిడివితో ఏ సర్టిఫికెట్ తెచ్చుకుని ప్రమోషన్లకు రెడీ అవుతోంది. నాని నిర్మాతగా ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టిన ప్యాన్ ఇండియా మూవీగా అభిమానుల్లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ డిజాస్టర్ నుంచి కోలుకుని తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. టీజర్ చూశాక హైప్ పెరిగింది కానీ అబ్ కి బార్ అర్జున్ సర్కార్ గా వచ్చిన ఆడియో సాంగ్ ఇంకా రీచ్ తెచ్చుకునే పనిలో ఉంది. సంగీతం సంగతలా ఉంచితే అసలు విషయాలు వేరే ఉన్నాయి.
ఇన్ సైడ్ ప్రకారం హిట్ 3 వయొలెన్స్ మోతాదు చాలా ఎక్కువగా ఉందట. హిట్ 1, హిట్ 2 లో సైకో చేసే హత్యలు చూశాం కానీ ఇప్పుడు మాత్రం హీరో చేయబోయే ఊచకోతకు నేరస్థులు బలయ్యే ఎపిసోడ్లు ఒళ్ళు గగుర్పొడిచేలా వచ్చాయట. టీజర్ లో చూపించింది కేవలం సాంపిల్ మాత్రమేనని ట్రైలర్ వచ్చాక నేషనల్ వైడ్ ఇదో హాట్ టాపిక్ అయ్యేలా విజువల్స్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పటిదాకా సౌత్ ఇండియాకు సంబంధించి మార్కోనే విపరీతమైన హింస ఉన్న సినిమాగా పేరు గాంచింది. దానికి పోటీ ఇచ్చేలా హిట్ 3 ఉంటుందని వినికిడి. అది నిజమో కాదో రేపు ట్రైలర్ లాంఛ్ తర్వాత తెలిసిపోతుంది.
హిందీతో పాటు ఇతర భాషల్లో మార్కెట్ ని పెంచుకునే క్రమంలో నాని హిట్ 3ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. పోటీలో సూర్య రెట్రో ఉండటంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చిన ఈ క్రైమ్ డ్రామాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మాములుగా అమ్మాయిలను హత్య చేసే సైకో కథలనే ఇప్పటిదాకా చూశాం కానీ హిట్ 3 లో మాత్రం రివర్స్ లో మర్డర్ చేసినవాళ్లను అంతకంటే కిరాతకంగా మట్టుబెట్టే అర్జున్ సర్కార్ ని చూస్తామట. ఈ స్థాయిలో ఊరిస్తున్నారంటే నాని ఏదో పెద్ద ప్లానింగ్ తో రాబోతున్నాడని అర్థమవుతోందిగా.
This post was last modified on April 13, 2025 9:53 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…