గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేసింది. హడావిడి లేకుండా గుళ్లో జరిగిన పూజా కార్యక్రమంలో టీమ్ మెంబెర్స్ లాంచ్ పూర్తి చేశారు. చాలా గ్యాప్ తర్వాత శంకర్ మహదేవన్ పాడటం మ్యూజిక్ లవర్స్ లో అంచనాలు రేపింది. ఆస్కార్ విజేత కీరవాణి ముప్పై సంవత్సరాల తర్వాత మెగాస్టార్ మూవీకి కంపోజ్ చేశారు. ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పి పరశురామ్ తర్వాత మళ్ళీ ఈ కలయిక ఇప్పుడు సాధ్యపడింది. సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
వినగానే ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉండటంతో పాటు చిరుని అందంగా చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది కానీ నిజానికి ఈ సాంగ్ గురించి ఫ్యాన్స్ ఊహించింది వేరని చెప్పాలి. కోటి స్వరకల్పనలో అల్లుడా మజాకాలో మా ఊరి దేవుడు అందాల రాముడు టైపులో ,మంచి హుషారు మిక్స్ చేసిన పాట ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అంత మోతాదులో కీరవాణి ఇవ్వలేదు. కథలో సందర్భానికి తగట్టు ఇలాంటి ట్యూన్ ఇచ్చారేమో కానీ ఒకవైపు సంతోషం, ఇంకోవైపు ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలగలిసి మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. సెట్ వర్క్, కొరియోగ్రఫీ బాగానే ఉన్నా రీచ్ ఎంత వస్తుందో వేచి చూడాలి.
విడుదల తేదీ గురించి సందిగ్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వంభర ఇలా పబ్లిసిటీ పర్వానికి తెరతీయడం సానుకూల సంకేతమే. జూలై 24 డేట్ లీకైనప్పటికీ యువి నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. బహుశా ట్రైలర్ లో ప్రకటిద్దామని చూస్తున్నారో ఏమో తెలియాల్సి ఉంది. భోళా శంకర్ తర్వాత కోరిమరీ గ్యాప్ తీసుకున్న చిరంజీవికి విశ్వంభర ఫలితం చాలా కీలకం. జగదేకవీరుడు అతిలోకసుందరి., అంజి తర్వాత తాను దూరంగా పెట్టేసిన ఫాంటసీ జానర్ ని ఇంత గ్యాప్ తర్వాత టచ్ చేశారు. బింబిసార తర్వాత ఏకంగా మెగా మూవీ రావడంతో దర్శకుడు వసిష్ఠ సైతం బెస్ట్ ఇవ్వడానికే కష్టపడుతున్నాడు.
This post was last modified on April 12, 2025 2:58 pm
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…