గత ఏడాది టీజర్ కొచ్చిన నెగటివ్ రెస్పాన్స్ దెబ్బకు వీడియో ప్రమోషన్లకు దూరంగా ఉన్న విశ్వంభర ఎట్టకేలకు ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేసింది. హడావిడి లేకుండా గుళ్లో జరిగిన పూజా కార్యక్రమంలో టీమ్ మెంబెర్స్ లాంచ్ పూర్తి చేశారు. చాలా గ్యాప్ తర్వాత శంకర్ మహదేవన్ పాడటం మ్యూజిక్ లవర్స్ లో అంచనాలు రేపింది. ఆస్కార్ విజేత కీరవాణి ముప్పై సంవత్సరాల తర్వాత మెగాస్టార్ మూవీకి కంపోజ్ చేశారు. ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పి పరశురామ్ తర్వాత మళ్ళీ ఈ కలయిక ఇప్పుడు సాధ్యపడింది. సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి.
వినగానే ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా ఉండటంతో పాటు చిరుని అందంగా చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది కానీ నిజానికి ఈ సాంగ్ గురించి ఫ్యాన్స్ ఊహించింది వేరని చెప్పాలి. కోటి స్వరకల్పనలో అల్లుడా మజాకాలో మా ఊరి దేవుడు అందాల రాముడు టైపులో ,మంచి హుషారు మిక్స్ చేసిన పాట ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అంత మోతాదులో కీరవాణి ఇవ్వలేదు. కథలో సందర్భానికి తగట్టు ఇలాంటి ట్యూన్ ఇచ్చారేమో కానీ ఒకవైపు సంతోషం, ఇంకోవైపు ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలగలిసి మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. సెట్ వర్క్, కొరియోగ్రఫీ బాగానే ఉన్నా రీచ్ ఎంత వస్తుందో వేచి చూడాలి.
విడుదల తేదీ గురించి సందిగ్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వంభర ఇలా పబ్లిసిటీ పర్వానికి తెరతీయడం సానుకూల సంకేతమే. జూలై 24 డేట్ లీకైనప్పటికీ యువి నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. బహుశా ట్రైలర్ లో ప్రకటిద్దామని చూస్తున్నారో ఏమో తెలియాల్సి ఉంది. భోళా శంకర్ తర్వాత కోరిమరీ గ్యాప్ తీసుకున్న చిరంజీవికి విశ్వంభర ఫలితం చాలా కీలకం. జగదేకవీరుడు అతిలోకసుందరి., అంజి తర్వాత తాను దూరంగా పెట్టేసిన ఫాంటసీ జానర్ ని ఇంత గ్యాప్ తర్వాత టచ్ చేశారు. బింబిసార తర్వాత ఏకంగా మెగా మూవీ రావడంతో దర్శకుడు వసిష్ఠ సైతం బెస్ట్ ఇవ్వడానికే కష్టపడుతున్నాడు.
This post was last modified on April 12, 2025 2:58 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…