జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఆయన పెద్ద అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి దంపతులు ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం లో గాయపడిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ కు ప్రమాదం జరగడంతోనే మెగాస్టార్ చిరు దంపతులు పవన్ తో కలిసి సింగపూర్ వెళ్లారు. తాజాగా గురువారం సాయంత్రం చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర సందేశాన్ని పోస్ట్ చేశారు ఈ పోస్టుకు తన సోదరుడు పవన్ తో కలిసి కనిపిస్తున్న తన ఫొటోను ఆయన జత చేశారు.
మార్క్ శంకర్ గురువారం సాయంత్రానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈ సందర్భంగా ఇదే విషయాన్ని తెలియ జేస్తూ చిరంజీవి ఈ పోస్టును చేశారు. “మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు” అంటూ సదరు పోస్టును మొదలుపెట్టిన చిరంజీవి… మార్క్ శంకర్ బాగానే ఉన్నాడని తెలిపారు. అయితే శంకర్ ఇంకా కోలుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. శంకర్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్లీ మామూలుగా ఎప్పటిలాగే ఉంటాడని ఆయన తెలిపారు. శుక్రవారం హనుమత్ జయంతి అని పేర్కొన్న చిరంజీవి… ఆ స్వామే ఓ పెద్ద ప్రమాదం నుంచి ఓ విషాదం నుంచి తన బిడ్డను కాపాడి తమకు అందించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావించిన చిరంజీవి… మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని, తమ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని, ఆశీస్సులు అందిస్తున్నారని పేర్కొన్నారు. తమ బిడ్డ క్షేమం కోరుకున్న వారందరికీ తన తరఫున, తన తమ్ముడు పవన్ కల్యాణ్ తరఫున… మొత్తంగా తమ కుటుంబం అందరి తరఫున అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. మొత్తంగా మార్క్ శంకర్ కు చాలా త్వరగానే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయిన వైనం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందన్న విషయాన్ని చిరంజీవి తన పోస్టులో చెప్పుకొచ్చారు.
This post was last modified on April 10, 2025 7:51 pm
విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమా.. కింగ్డమ్. విజయ్ గత చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ ఎంత పెద్ద…
ఏపీ సీఎం చంద్రబాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జరుగుతుందో తాజాగా అదే జరిగింది. ఒక్క దెబ్బకు 284 మంది ఔట్ సోర్సింగ్…
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది.…
వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు…
తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. ``అడవుల్లోకి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో పర్యటించారు.…