క్రిష్ తలపెట్టిన ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పవన్కళ్యాణ్తో అతను మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి ప్రారంభమవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అది జరిగే వీల్లేదనేది ఇండస్ట్రీ రిపోర్ట్. ఎందుకంటే వకీల్ సాబ్ చిత్రంలోని ఫ్లాష్బ్యాక్ సన్నివేశాల కోసం పవన్కళ్యాణ్ గెటప్ మారుస్తాడు. ఆ సన్నివేశాలను వకీల్ సాబ్ చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా గెటప్లోకి మారతాడు. ఈ రెండు చిత్రాల్లోను పవన్ తన రెగ్యులర్ హెయిర్ స్టయిల్తోనే కనిపిస్తాడు.
కానీ క్రిష్ సినిమాలో మాత్రం కాస్త పెరిగిన జుట్టుతో జులపాలను తలపించే హెయిర్ స్టయిల్తో వుంటాడు. కనుక ప్యారలల్గా క్రిష్ సినిమా చేసే వీల్లేదు. వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే క్రిష్ చిత్రం తిరిగి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మార్చి లేదా ఏప్రిల్ నుంచే పవన్ ఆ సినిమాకు రెడీగా వుంటాడు. కనుక దసరా రిలీజ్కు ప్లాన్ చేసుకునేలా క్రిష్ తన సినిమాను పూర్తి చేసుకోవచ్చు. ఇదిలావుంటే హరీష్ శంకర్ సినిమా మాత్రం 2022 సమ్మర్లోనే వస్తుందని అంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన పిమ్మట పవన్ తిరిగి రాజకీయ ప్రచారంతో బిజీ అవుతాడని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 1, 2020 9:41 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…