క్రిష్ తలపెట్టిన ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పవన్కళ్యాణ్తో అతను మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి ప్రారంభమవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అది జరిగే వీల్లేదనేది ఇండస్ట్రీ రిపోర్ట్. ఎందుకంటే వకీల్ సాబ్ చిత్రంలోని ఫ్లాష్బ్యాక్ సన్నివేశాల కోసం పవన్కళ్యాణ్ గెటప్ మారుస్తాడు. ఆ సన్నివేశాలను వకీల్ సాబ్ చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా గెటప్లోకి మారతాడు. ఈ రెండు చిత్రాల్లోను పవన్ తన రెగ్యులర్ హెయిర్ స్టయిల్తోనే కనిపిస్తాడు.
కానీ క్రిష్ సినిమాలో మాత్రం కాస్త పెరిగిన జుట్టుతో జులపాలను తలపించే హెయిర్ స్టయిల్తో వుంటాడు. కనుక ప్యారలల్గా క్రిష్ సినిమా చేసే వీల్లేదు. వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే క్రిష్ చిత్రం తిరిగి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మార్చి లేదా ఏప్రిల్ నుంచే పవన్ ఆ సినిమాకు రెడీగా వుంటాడు. కనుక దసరా రిలీజ్కు ప్లాన్ చేసుకునేలా క్రిష్ తన సినిమాను పూర్తి చేసుకోవచ్చు. ఇదిలావుంటే హరీష్ శంకర్ సినిమా మాత్రం 2022 సమ్మర్లోనే వస్తుందని అంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన పిమ్మట పవన్ తిరిగి రాజకీయ ప్రచారంతో బిజీ అవుతాడని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 1, 2020 9:41 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…