క్రిష్ తలపెట్టిన ‘కొండ పొలం’ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో పవన్కళ్యాణ్తో అతను మొదలు పెట్టిన జానపద చిత్రం కూడా తిరిగి ప్రారంభమవుతుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అది జరిగే వీల్లేదనేది ఇండస్ట్రీ రిపోర్ట్. ఎందుకంటే వకీల్ సాబ్ చిత్రంలోని ఫ్లాష్బ్యాక్ సన్నివేశాల కోసం పవన్కళ్యాణ్ గెటప్ మారుస్తాడు. ఆ సన్నివేశాలను వకీల్ సాబ్ చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా గెటప్లోకి మారతాడు. ఈ రెండు చిత్రాల్లోను పవన్ తన రెగ్యులర్ హెయిర్ స్టయిల్తోనే కనిపిస్తాడు.
కానీ క్రిష్ సినిమాలో మాత్రం కాస్త పెరిగిన జుట్టుతో జులపాలను తలపించే హెయిర్ స్టయిల్తో వుంటాడు. కనుక ప్యారలల్గా క్రిష్ సినిమా చేసే వీల్లేదు. వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాతే క్రిష్ చిత్రం తిరిగి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మార్చి లేదా ఏప్రిల్ నుంచే పవన్ ఆ సినిమాకు రెడీగా వుంటాడు. కనుక దసరా రిలీజ్కు ప్లాన్ చేసుకునేలా క్రిష్ తన సినిమాను పూర్తి చేసుకోవచ్చు. ఇదిలావుంటే హరీష్ శంకర్ సినిమా మాత్రం 2022 సమ్మర్లోనే వస్తుందని అంటున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన పిమ్మట పవన్ తిరిగి రాజకీయ ప్రచారంతో బిజీ అవుతాడని అంచనా వేస్తున్నారు.
This post was last modified on November 1, 2020 9:41 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…