టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగిపోతున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ రోజు చాలా కీలకం. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో పెద్ద హీరోలతో నిర్మించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానుండటం వాళ్ళ భవిష్యత్ ప్రణాళికల మీద ప్రభావం చూపించబోతోంది. గుడ్ బ్యాడ్ ఆగ్లీకి తమిళనాడులో భారీ బజ్ ఉంది. చాలా గ్యాప్ తర్వాత అజిత్ చేసిన ఊర మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఫ్యాన్స్ దీని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ ని నమ్మి భారీ బడ్జెట్ కుమ్మరించారు. ఇతర భాషల్లో బజ్ లేకపోయినప్పటికీ ఒరిజినల్ వెర్షన్ బ్లాక్ బస్టర్ అయితే మైత్రికి కాసుల పంటే.
కాకపోతే విడాముయార్చితో పాటు గత చిత్రాల ఫలితం అజిత్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోందనేది అడ్వాన్స్ బుకింగ్స్ లో తేటతెల్లమవుతోంది. ప్రమోషన్లు చేసే అవకాశం లేకపోవడంతో పాటు అజిత్ పబ్లిసిటీ దూరంగా ఉండే వైనం కొంత ప్రతికూలంగా మారి సాధారణ ప్రేక్షకులను గుడ్ బ్యాడ్ అగ్లీ వైపు చూసేలా చేయలేకపోతోంది. ఈ ప్రతికూలతను కనక పాజిటివ్ టాక్ తట్టుకుంటే హ్యాపీగా బయట పడొచ్చు. ఇక హిందీలో సన్నీ డియోల్ తో చేసిన జాట్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. గదర్ 2 తర్వాత చేసిన మూవీగా మాస్ ఆడియన్స్ లో దీని మీద పెద్ద అంచనాలు నెలకొన్నాయి.
దర్శకుడు గోపిచంద్ మలినేని సౌత్ స్టైల్ లో తీయడం, క్యాస్టింగ్ లో అధిక భాగం తెలుగు వాళ్ళే ఉండటం వల్ల బాలీవుడ్ ఫ్లేవర్ తగ్గిన ఫీలింగ్ జనాల్లో కనిపిస్తోంది. ఇది దాటుకునేలా టాక్ వస్తే జాట్ ఖచ్చితంగా జాక్ పాట్ అవుతుంది. తమన్ సంగీతం సైతం పెద్దగా రిజిస్టర్ కాలేకపోయింది. సో జవాన్, పఠాన్ రేంజ్ లో టాక్ వస్తే సులభంగా వంద కోట్ల నెట్ దాటేయొచ్చు. జాట్ కి మైత్రితో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామి కావడం మరో గమనించాల్సిన విషయం. మరి మైత్రి రెండు గుర్రాల స్వారీ ఎలాంటి ఫలితం ఇస్తుందో, మరిన్ని సినిమాలు తీసేందుకు ప్రేరేపిస్తుందో లేదో చూడాలి.
హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా 'ఈవిల్ డెడ్' సినిమాకున్న ఆదరణ…
కొన్ని కాకతాళీయంగా జరిగినట్టు అనిపించినా దాని వెనుక తెలుసుకోవాల్సిన బాక్సాఫీస్ సత్యాలు చాలా ఉంటాయి. అలాంటిదే ఇది. ఇండస్ట్రీకి వచ్చి…
నిన్న ధనుష్ తమిళ్ మురుగన్ టీజర్ వచ్చాక మొదట ఆందోళన చెందింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలోనూ…
పల్లి పల్లి లోకేశ్... ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో,…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా…
పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా…