వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్న నాని ప్యారడైజ్, రామ్ చరణ్ పెద్దిల గురించే అందరూ మాట్లాడుతున్నారు కానీ వీటికన్నా వారం ముందు మార్చి 19 రాబోతున్న టాక్సిక్ ని తక్కువంచనా వేస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఏడు రోజుల గ్యాప్ ఉన్నా సరే యష్ ని సులభంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఉత్తరాది మార్కెట్ లో కెజిఎఫ్ పుణ్యమాని యష్ కు భారీ డిమాండ్ ఉంది. ఆ కారణంగానే బాలీవుడ్ నుంచి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోవడం ద్వారా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెలివైన ఎత్తుగడ వేశారు.
గతంలో వచ్చిన టాక్సిక్ టీజర్ మీద నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చిన నేపధ్యంలో ముందస్తుగా దాని మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో అర్థం కాని అయోమయం బయ్యర్ వర్గాల్లో ఉంది. అయితే యష్ పుట్టినరోజు కోసం ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి హడావిడిగా కట్ చేసిన వీడియో తప్ప అసలు కంటెంట్ కు దానికి సంబంధం లేదని బెంగళూరు రిపోర్ట్. ఎవరూ ఊహించనంత యాక్షన్ విజువల్స్ తో టాక్సిక్ రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్. నయనతార పాత్రకు సైతం చాలా ప్రాధాన్యం ఉంటుందని, తనకు హీరోకు మధ్య ఉన్న బాండింగ్ కథలో కీలకమైన మలుపులకు కారణమవుతుందని అంటున్నారు
సో నార్త్ స్టేట్స్ లో టాక్సిక్ నుంచి ప్యారడైజ్, పెద్దిలకు ఆషామాషీ పోటీ అయితే ఉండదు. ఒకవేళ యష్ మూవీ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే దానికి ధీటుగా రామ్ చరణ్, నానిలు మెప్పించాల్సి ఉంటుంది. పుష్ప 2 పంపిణి చేసిన అనిల్ తదానినే టాక్సిక్, పెద్దిలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే వార్త మరో ఆసక్తికరమైన విషయం. ఇక్కడితో అయిపోలేదు. మార్చి 21 రన్బీర్ కపూర్ – సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ సైతం రెడీ అంటోంది. ఇంకా చాలా టైం ఉంది కనక ఎవరెవరు తప్పుకుంటారు ఎవరు మాట మీద ఉంటారనేది ఇప్పుడే చెప్పలేం కానీ మొత్తానికి రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…