రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో ఉన్న మెగాభిమానులు దీని మీద గంపెడాశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే మొన్నోసారి నిర్మాత వెయ్యిసార్లు చూడొచ్చంటూ పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. ఎన్నడూ లేనిది రామ్ చరణ్ చాలా స్పెషల్ గా దర్శకుడు బుచ్చిబాబుకి హనుమంతుడి భక్తిని చాటే కానుకలు పంపడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఇంత అభిమానం తను గతంలో శంకర్ లాంటి లెజెండరీ డైరెక్టర్ మీద కూడా చూపించలేదు. అంటే పెద్ది నిర్మాణంలోనే చరణ్ కు ఆ స్థాయిలో బుచ్చిబాబు మీద నమ్మకం వచ్చేసిందన్న మాట.
ఇప్పుడీ ఫస్ట్ షాట్ టీజరే పెద్ది వ్యాపారానికి తొలిమెట్టు కానుంది. సహజంగానే దీని మీద బజ్ ఉన్నప్పటికి ఏ మోతాదులో నమ్మకం పెట్టుకోవాలనే దాని మీద బయ్యర్లు కొంత అయోమయంలోనే ఉన్నారు. వాటికి కొంత సమాధానం రేపు దొరుకుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఎలా ఉంటుందనే శాంపిల్ కూడా ఇందులోనే వినబోతున్నాం. గేమ్ ఛేంజర్ ఫలితంతో సంబంధం లేకుండా పెద్దికి క్రేజ్ ఏర్పడుతుందనేది డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. టైటిల్ మాస్ గా పెట్టడం, రంగస్థలం తర్వాత అంతకు మించి అనే స్థాయిలో గెటప్ డిజైన్ చేయడం ఇవన్నీ బిజినెస్ కోణంలో చూసుకుంటే సానుకూల అంశాలే.
విడుదల తేదీ వచ్చే ఏడాది మార్చిలో ఉంటుందని వినిపిస్తున్న నేపథ్యంలో అది ఫస్ట్ షాట్ లో పొందుపరుస్తారా లేదా అనేది వేచి చూడాలి. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ తదితరులను రేపు రివీల్ చేయకపోవచ్చు. ఇంకా రిలీజ్ చాలా దూరంలో ఉంది కాబట్టి నెమ్మదిగా ప్రమోషన్ కంటెంట్ వదులుతారు. హక్కుల కోసం ఇప్పటికే డిమాండ్ ఉన్నా టీజర్ వచ్చాక రేట్లు మరింత ఎక్కువగా ఆఫర్ చేస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది. పెద్ది తర్వాత చేయబోయే సుకుమార్ సినిమాకు ఎక్కువ టైం పట్టేలా ఉంది కాబట్టి అంత గ్యాప్ కి న్యాయం చేకూరేలా శిష్యుడు బుచ్చిబాబు సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే.
This post was last modified on April 5, 2025 2:54 pm
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు…