ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా చేయడానికి. ఇక అది ఓటిటిలో ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసే సౌలభ్యంతో వస్తే అంతకంటే ఏం కావాలి. నెట్ ఫ్లిక్స్ ‘టెస్ట్’ని ప్రమోట్ చేసినప్పుడు మూవీ లవర్స్ దీని మీద ఆసక్తి కనబరిచారు. నిజానికిది థియేటర్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చి ఆఖరికి డిజిటల్ కు దారి వేసుకుంది. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కం ఎమోషనల్ డ్రామా కేవలం క్యాస్టింగ్ వల్ల హైప్ తెచ్చుకుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రేక్షకుడిని ఓడించింది.
ఎలాగో చూద్దాం. కథ విషయానికి వస్తే టీచర్ కుముద (నయనతార), సైంటిస్ట్ శరవణన్ (మాధవన్) భార్యా భర్తలు. సంతానం ఉండదు. సరోగసి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. స్టార్ క్రికెటర్ గా పేరున్న అర్జున్ (సిద్దార్థ్) ఇండియా టీమ్ లో స్థిరమైన స్థానం సంపాదించుకోలేక ఫామ్ తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఊహించని పరిణామాల మధ్య బెట్టింగ్ మాఫియా వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అర్జున్ కొడుకుని శరవణన్ కిడ్నాప్ చేసే విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. దీనికి ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచుకు ముడి ఉంటుంది. అదేంటి, సంబంధం లేని వీళ్ళ మధ్య ఎందుకిలా జరిగిందనేది అసలు స్టోరీ.
పాయింట్ పరంగా కొంచెం ఆసక్తికరంగా నడిపించే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు ఎస్ శశికాంత్ ఆ దిశగా బలమైన కథనం రాసుకోలేదు. దాని ఫలితంగా సన్నివేశాల్లో ఎమోషన్ లేక ఏదో భారంగా గడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సిద్దార్థ్, నయన్, మాధవన్ తమ పెర్ఫార్మన్స్ తో ఓ మోస్తరుగా నెట్టుకొచ్చారు కానీ కంటెంట్ కోణంలో చూస్తే మాత్రం ప్రేక్షకుల సహనంతో టెస్టు మ్యాచు ఆడుకునే రేంజ్ లో టెస్ట్ సాగుతుంది. క్యారెక్టరైజేషన్లలో లోపాలు, దారీతెన్నూ లేకుండా నడిచే సీన్లు మొత్తం ఒక ప్రహసనంగా మారిపోతుంది. టన్నుల్లో ఓపిక ఉంటే తప్ప ఇలాంటి టెస్టులను తట్టుకోవడం కష్టం. చివరికి ఓడిపోయింది ఆడియన్సే.
This post was last modified on April 4, 2025 9:08 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…