ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా చేయడానికి. ఇక అది ఓటిటిలో ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేసే సౌలభ్యంతో వస్తే అంతకంటే ఏం కావాలి. నెట్ ఫ్లిక్స్ ‘టెస్ట్’ని ప్రమోట్ చేసినప్పుడు మూవీ లవర్స్ దీని మీద ఆసక్తి కనబరిచారు. నిజానికిది థియేటర్ రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చి ఆఖరికి డిజిటల్ కు దారి వేసుకుంది. ఎస్ శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ కం ఎమోషనల్ డ్రామా కేవలం క్యాస్టింగ్ వల్ల హైప్ తెచ్చుకుంది. అయితే దురదృష్టవశాత్తు ప్రేక్షకుడిని ఓడించింది.
ఎలాగో చూద్దాం. కథ విషయానికి వస్తే టీచర్ కుముద (నయనతార), సైంటిస్ట్ శరవణన్ (మాధవన్) భార్యా భర్తలు. సంతానం ఉండదు. సరోగసి కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. స్టార్ క్రికెటర్ గా పేరున్న అర్జున్ (సిద్దార్థ్) ఇండియా టీమ్ లో స్థిరమైన స్థానం సంపాదించుకోలేక ఫామ్ తో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఊహించని పరిణామాల మధ్య బెట్టింగ్ మాఫియా వీళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అర్జున్ కొడుకుని శరవణన్ కిడ్నాప్ చేసే విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతాయి. దీనికి ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచుకు ముడి ఉంటుంది. అదేంటి, సంబంధం లేని వీళ్ళ మధ్య ఎందుకిలా జరిగిందనేది అసలు స్టోరీ.
పాయింట్ పరంగా కొంచెం ఆసక్తికరంగా నడిపించే స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు ఎస్ శశికాంత్ ఆ దిశగా బలమైన కథనం రాసుకోలేదు. దాని ఫలితంగా సన్నివేశాల్లో ఎమోషన్ లేక ఏదో భారంగా గడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సిద్దార్థ్, నయన్, మాధవన్ తమ పెర్ఫార్మన్స్ తో ఓ మోస్తరుగా నెట్టుకొచ్చారు కానీ కంటెంట్ కోణంలో చూస్తే మాత్రం ప్రేక్షకుల సహనంతో టెస్టు మ్యాచు ఆడుకునే రేంజ్ లో టెస్ట్ సాగుతుంది. క్యారెక్టరైజేషన్లలో లోపాలు, దారీతెన్నూ లేకుండా నడిచే సీన్లు మొత్తం ఒక ప్రహసనంగా మారిపోతుంది. టన్నుల్లో ఓపిక ఉంటే తప్ప ఇలాంటి టెస్టులను తట్టుకోవడం కష్టం. చివరికి ఓడిపోయింది ఆడియన్సే.
This post was last modified on April 4, 2025 9:08 pm
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…