త్రివిక్రమ్ మలి చిత్రం రామ్తో వుంటుందని ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇంకా దీనిపై అటు హారిక హాసిని వాళ్లు కానీ, ఇటు రామ్ కానీ స్పందించలేదు. కానీ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా మరింత ఆలస్యమయ్యేట్టు అయితే రామ్తో సినిమా ఖాయమని చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ అవకాశాన్ని ఎలాగయినా కైవసం చేసుకోవాలని రామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.
త్రివిక్రమ్తో ఫ్యామిలీ సినిమా కాకుండా ‘జులాయి’ లాంటి యాక్షన్ బేస్డ్ ఫ్యామిలీ సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే తన కోరికను త్రివిక్రమ్కు రామ్ వెలిబుచ్చాడట. స్రవంతి రవికిషోర్తో వున్న అనుబంధం వల్ల త్రివిక్రమ్కు రామ్తో సినిమా చేసే ఆబ్లిగేషన్ అయితే ఎప్పట్నుంచో వుంది. అయితే వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేయడం వల్ల అది ఇంతవరకు కుదర్లేదు.
ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్.’ నుంచి బయట పడడానికి టైమ్ పడుతుందంటే మాత్రం ఈ చిత్రం ఖచ్చితంగా మెటీరియలైజ్ అవుతుందని అంటున్నారు. నితిన్తో ‘అ.ఆ’ తీసినట్టుగా నలభై కోట్ల బడ్జెట్లో సినిమా తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తే రామ్ అదృష్టం పండినట్టే. ఇస్మార్ట్ శంకర్తో వచ్చిన మార్కెట్ కన్సాలిడేట్ అయిపోయి మిడ్ రేంజ్ హీరోల్లో తన రేంజ్ మరింత పెరిగిపోవడం గ్యారెంటీ.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…