Movie News

పవన్‍కళ్యాణ్‍కి మరో సమస్య

పవన్‍కళ్యాణ్‍ ‘వకీల్‍ సాబ్‍’ తర్వాత చేసేది ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేకే. ఈ రీమేక్‍ కథని పవన్‍కళ్యాణ్‍ ఇమేజ్‍కి అనుగుణంగా దర్శకుడు సాగర్‍ చంద్ర మార్చేసాడట. అయితే ఇందులో నటించే మరో హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. వకీల్‍ సాబ్‍ షూటింగ్‍ పూర్తయ్యే సరికి ప్రీ ప్రొడక్షన్‍ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో పవన్‍ సరసన నటించే హీరోయిన్‍ ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎందుకంటే ఇది పూర్తిగా హీరోల సినిమా. కేవలం హీరోలు నువ్వా నేనా అన్నట్టు పోటీలు పడుతుంటారు. దాంతో హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యత వుండదు. అందుకే మలయాళంలో హీరోయిన్లను కాకుండా క్యారెక్టర్‍ ఆర్టిస్టుల లాంటి వాళ్లతో తీసేసారు. కానీ పవన్‍ కళ్యాణ్‍ సినిమాలో అలా చేయడానికి కుదరదు. అలా అని పవన్‍ పక్కన నటించే అవకాశం వచ్చినా కానీ అసలు ప్రాధాన్యతే లేని పాత్రను ఎవరు పోషిస్తారు. గట్టిగా వారం రోజుల కాల్షీట్లు అవసరం లేని పాత్రకోసం నిర్మాతలు మాత్రం ఎంతని వెచ్చిస్తారు? అందుకే పవన్‍ సరసన నటించేదెవరనేది ఇప్పుడు నిర్మాతలకు పెద్ద సవాల్‍గా మారింది.

సాయి పల్లవి పేరు వినిపిస్తోంది కానీ ఆమె నటించే అవకాశాలు తక్కువే. వేదళాం రీమేక్‍లో చిరంజీవి చెల్లెలిగా నటించడానికి కూడా ఆమె కాదనడంతో కీర్తి సురేష్‍ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటిది అసలు ఇంపార్టెన్సే లేని పాత్రను ఎందుకు చేస్తుంది?

This post was last modified on October 31, 2020 7:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

36 minutes ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

2 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

2 hours ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

4 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

5 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

6 hours ago