మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల నెరవేర్చుకునేవాళ్లు కొద్ది మందే. యువ దర్శకుడు వెంకీ కుడుములకు కూడా ఆ ఆవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన అతడికి ఐదేళ్ల ముందు చిరు నుంచి పిలుపొచ్చింది. ఇద్దరి కలయికలో యువి క్రియేషన్స్ సంస్థ సినిమా చేయడానికి రెడీ అయింది.
ముందుగా వెంకీ చెప్పిన లైన్ కూడా చిరుకు నచ్చింది. కానీ ఫుల్ స్క్రిప్టు విన్నాక చిరు సంతృప్తి చెందలేదు. ఇంకో కథ చేసుకుని రమ్మన్నారు. కానీ వెంకీ మాత్రం ఆ ప్రయత్నం చేయకుండా ‘భీష్మ’ హీరో నితిన్తోనే ఇంకో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. అదే.. రాబిన్ హుడ్. ఇది తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అని.. దీంతో పెద్ద హిట్ కొడతానని.. మళ్లీ చిరుతో సినిమా కోసం ప్రయత్నిస్తానని చాలా ధీమాగా చెప్పాడు ప్రి రిలీజ్ ఇంటర్వ్యూల్లో వెంకీ.
కట్ చేస్తే ‘రాబిన్ హుడ్’ రిలీజైంది. వెంకీ కెరీర్లో బెస్ట్ మూవీ కాకపోగా.. ముందు చిత్రాలకు దరిదాపుల్లో కూడా నిలవలేకపోయింది. దీని కోసమా వెంకీ ఇన్నేళ్లు కష్టపడ్డాడు అనిపించింది సినిమా చూసిన వాళ్లకు. ‘భీష్మ’ తర్వాత చిరు సినిమా కోసం పెట్టిన టైం.. తర్వాత ‘రాబిన్ హుడ్’ మొదలుపెట్టి పూర్తి చేసి రిలీజ్ చేయడానికి అయిన సమయం కలిపితే మొత్తం ఐదేళ్లు కావడం గమనార్హం. ఇన్నేళ్లు టైం పెట్టి కష్టపడితే చివరికి డిజాస్టర్ రిజల్టే వచ్చింది.
గత వారాంతంలో గట్టి పోటీ మధ్య రిలీజైన ‘రాబిన్ హుడ్’.. ఏమాత్రం నిలబడలేకపోయింది. వీకెండ్లోనే సరైన వసూళ్లు సాధించలేకపోయిన ఈ చిత్రం మీద ఇక ఆశలు పెట్టుకోవడానికి ఏమీ లేదు. ‘భీష్మ’ హిట్టయ్యాక వెంకీ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు. అందుకే చిరు నుంచి కూడా పిలుపొచ్చింది. కట్ చేస్తే అటు చిరు సినిమా చేజారింది. ఇటు ‘రాబిన్ హుడ్’ కూడా పోయింది. ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడీ యువ దర్శకుడు. ఈ స్థితిలో తనతో సినిమా చేసే హీరో, నిర్మాత ఎవరో?
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…