హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ ఫాంటసీ డ్రామా ఆగస్టు 1న రిలీజ్ అవుతుంది. ఇందులో మంచు మనోజ్ విలన్ గా చేయడం అంచనాలు ఆల్రెడీ పెంచేసింది. దీనికి సంబంధించిన టీజర్ గతంలో వచ్చి ఫ్యాన్స్ మెప్పు పొందింది. తాజాగా దగ్గుబాటి రానా ఈ క్రేజీ క్యాస్టింగ్ లో భాగమైనట్టుగా లేటెస్ట్ అప్డేట్. పాత్ర తీరుతెన్నులు ఇంకా తెలియలేదు.
వాస్తవానికి ఈ క్యారెక్టర్ కు ముందు దుల్కర్ సల్మాన్ ని అనుకున్నారు. కానీ డేట్లు తదితర సమస్యల వల్ల ఆ స్థానంలో రానా వచ్చినట్టు తెలిసింది. రానా నిర్మాణంలోనే దుల్కర్ ‘కాంత’లో హీరోగా చేయడం ఈ లింక్ ముడిపడేందుకు దోహదం చేసినట్టు అంతర్గత సమాచారం. సో మిరాయ్ లో తేజ, మనోజ్ తో పాటు రానా జత కట్టడం హైప్ పరంగా చాలా ప్లస్ కానుంది మానవాళికి సవాల్ గా మారిన ఒక అంతుచిక్కని రహస్యం కోసం సాహస యాత్రలు చేసే యువకుడిగా తేజ ఇందులో డైనమిక్ గా కనిపించనున్నట్టు వినికిడి. మార్కెట్ ఎంతనేది కాకుండా కంటెంట్ ని నమ్మి పీపుల్స్ మీడియా వంద కోట్లకు పైగా పెడుతోంది.
రాజా సాబ్, మిరాయ్ లాంటి రెండు ప్యాన్ ఇండియా మూవీస్ ని ఒకేసారి సెట్స్ మీద పెట్టిన పీపుల్స్ మీడియా వీటి మీద అయిదు వందల కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. విడుదల పరంగా రెండింటి మధ్య గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్యాన్ ఇండియా భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన లాంగ్వేజెస్ లో మిరాయ్ విడుదల కానుంది.రవితేజ ఈగల్ తర్వాత కార్తిక్ ఘట్టమనేని ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో మిరాయ్ మీద పని చేస్తున్నాడు. విజువల్స్ అబ్బురపరిచేలా ఉంటాయని విఎఫ్ఎక్స్ గురించి వినిపిస్తున్న టాక్. ఇదే నిజమైతే తేజ సజ్జ ఇమేజ్ మరింత ఎగబాకినట్టే.
This post was last modified on April 2, 2025 7:56 am
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…