నాగచైతన్యని పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ తిరిగి నటన వైపు దృష్టి సారించబోతోంది. ఆ మధ్య ఓ వెబ్ మూవీ వచ్చింది కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో రిలీజైన విషయమే చాలా మందికి తెలియకుండా పోయింది. తాజాగా శోభితకు దర్శకుడు పా రంజిత్ తో కలిసి పని చేసే అవకాశం రానుంది. వెట్టువమ్ టైటిల్ తో పా రంజిత్ మూడేళ్ళ క్రితమే ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అంటే తంగలాన్ కంటే ముందే. కానీ ఏవేవో కారణాల వల్ల అది ఆలస్యమవుతూ వచ్చింది. మధురై బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాగా త్వరలోనే షూట్ మొదలుపెట్టబోతున్నట్టు చెన్నై టాక్.
దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఆసక్తి రేపెలా ఉన్నాయి. వెట్టువమ్ లో వరుడు ఫేమ్ ఆర్య విలన్ గా నటించనుండగా మనకు అంతగా పరిచయం లేకపోయినా పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పేరు తెచ్చున్న దినేష్ లీడ్ రోల్ పోషించనున్నాడు. దొంగతనాలు వృత్తిగా మార్చుకున్న హీరో శత్రువులను అంతమొందించేందుకు పోలీస్ గా మారతాడు. కానీ తాను ఊహించిన దానికన్నా దారుణమైన పరిస్థితులు ఖాకీ వ్యవస్థలో ఉన్నట్టు తెలుసుకుని అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. పాయింట్ మరీ కొత్తగా అనిపించనప్పటికీ సబ్జెక్టులోని పా రంజిత్ ట్రీట్మెంట్ వేరే స్థాయిలో ఉంటుందని కోలీవుడ్ టాక్.
ఇప్పుడిది సెట్స్ పైకి వెళ్తోంది కాబట్టి శోభిత ధూళిపాళకు మంచి ఛాన్స్ దొరికినట్టే. అసలే పా రంజిత్ సినిమాల్లో హీరోయిన్లకు చాలా ఛాలెంజులు ఉంటాయి. ఊరికే ఆడిపాడే తరహా కాకుండా క్లిష్టమైన క్యారెక్టరైజేషన్ ఇస్తాడు. తంగలాన్ లో మాళవిక మోహనన్ ని వాడుకున్న తీరే దానికి నిదర్శనం. అయినా మూడేళ్ళ క్రితం అనౌన్స్ చేసి ఆపేసిన సినిమాను ఇప్పుడు కొనసాగించడం విచిత్రమే. ఒకప్పుడు రజనీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు చేసే రికార్డు దక్కించుకున్న ఈ విలక్షణ దర్శకుడు తర్వాత ట్రాక్ తప్పేశారు. అయినా సరే తనమీద ప్రత్యేక అంచనాలు పెట్టుకునే అభిమానులు వేరే ఉన్నారు.
This post was last modified on April 1, 2025 2:51 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…