నాగచైతన్యని పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ తిరిగి నటన వైపు దృష్టి సారించబోతోంది. ఆ మధ్య ఓ వెబ్ మూవీ వచ్చింది కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో రిలీజైన విషయమే చాలా మందికి తెలియకుండా పోయింది. తాజాగా శోభితకు దర్శకుడు పా రంజిత్ తో కలిసి పని చేసే అవకాశం రానుంది. వెట్టువమ్ టైటిల్ తో పా రంజిత్ మూడేళ్ళ క్రితమే ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అంటే తంగలాన్ కంటే ముందే. కానీ ఏవేవో కారణాల వల్ల అది ఆలస్యమవుతూ వచ్చింది. మధురై బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ డ్రామాగా త్వరలోనే షూట్ మొదలుపెట్టబోతున్నట్టు చెన్నై టాక్.
దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఆసక్తి రేపెలా ఉన్నాయి. వెట్టువమ్ లో వరుడు ఫేమ్ ఆర్య విలన్ గా నటించనుండగా మనకు అంతగా పరిచయం లేకపోయినా పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పేరు తెచ్చున్న దినేష్ లీడ్ రోల్ పోషించనున్నాడు. దొంగతనాలు వృత్తిగా మార్చుకున్న హీరో శత్రువులను అంతమొందించేందుకు పోలీస్ గా మారతాడు. కానీ తాను ఊహించిన దానికన్నా దారుణమైన పరిస్థితులు ఖాకీ వ్యవస్థలో ఉన్నట్టు తెలుసుకుని అనూహ్య నిర్ణయం తీసుకుంటాడు. పాయింట్ మరీ కొత్తగా అనిపించనప్పటికీ సబ్జెక్టులోని పా రంజిత్ ట్రీట్మెంట్ వేరే స్థాయిలో ఉంటుందని కోలీవుడ్ టాక్.
ఇప్పుడిది సెట్స్ పైకి వెళ్తోంది కాబట్టి శోభిత ధూళిపాళకు మంచి ఛాన్స్ దొరికినట్టే. అసలే పా రంజిత్ సినిమాల్లో హీరోయిన్లకు చాలా ఛాలెంజులు ఉంటాయి. ఊరికే ఆడిపాడే తరహా కాకుండా క్లిష్టమైన క్యారెక్టరైజేషన్ ఇస్తాడు. తంగలాన్ లో మాళవిక మోహనన్ ని వాడుకున్న తీరే దానికి నిదర్శనం. అయినా మూడేళ్ళ క్రితం అనౌన్స్ చేసి ఆపేసిన సినిమాను ఇప్పుడు కొనసాగించడం విచిత్రమే. ఒకప్పుడు రజనీకాంత్ తో వరుసగా రెండు సినిమాలు చేసే రికార్డు దక్కించుకున్న ఈ విలక్షణ దర్శకుడు తర్వాత ట్రాక్ తప్పేశారు. అయినా సరే తనమీద ప్రత్యేక అంచనాలు పెట్టుకునే అభిమానులు వేరే ఉన్నారు.
This post was last modified on April 1, 2025 2:51 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…