దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కెరీర్ లో బ్యాడ్ మూవీ ఏదంటే ముందుగా మహేష్ బాబు అభిమానులు ఠక్కున చెప్పే పేరు స్పైడర్. ఇకపై ఆ అవసరం లేకుండా సికందర్ వచ్చేసింది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా రూపొందిన ఈ భారీ యాక్షన్ మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. రిలీజ్ కు కొన్ని గంటల ముందే హెచ్ది పైరసీ బారిన పడిన ఈ సినిమా మీద వచ్చినన్ని నెగటివ్ రివ్యూలు, పూర్ టాక్స్ గత దశాబ్ద కాలంలో దేనికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి సల్మానే వరస్ట్ అని ఒప్పుకునే రేస్ 3 సైతం దీనికన్నా మెరుగైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇంతకీ సికందర్ కథా కమామీషు ఏంటో చూద్దాం.
రాజ్ కోట్ ఊరికి సంజయ్ అలియాస్ సికందర్ (సల్మాన్ ఖాన్) అనధికార దేవుడు. మహారాజుగా కీర్తించబడుతూ ఉంటాడు. భార్య సాయిశ్రీ (రష్మిక మందన్న) ఒక యాక్సిడెంట్ లో చనిపోతే ఆమె అవయవాలు వివాహిత వైదేహీ (కాజల్ అగర్వాల్) తో పాటు మరో ఇద్దరికి అమరుస్తారు. వాళ్ళ బాగోగులు చూసేందుకు ముంబై వెళ్తాడు సికందర్. కొడుకు మరణానికి సంజయే కారణమని రగిలిపోతున్న హోమ్ మినిస్టర్ ప్రధాన్ (సత్యరాజ్) ఇపుడా ముగ్గురితో పాటు హీరోని చంపేందుకు కంకణం కట్టుకుంటాడు. చివరికి ఎవరు గెలుస్తారు, క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది చిన్నపిల్లాడు కూడా సులభంగా చెప్పేలా ముగుస్తుంది.
స్టోరీ సంగతి పక్కనపెడితే 80 దశకం నాటి ట్రీట్ మెంట్ తో అసలిలాంటి సబ్జెక్టు ఎలా వర్కౌట్ అవుతుందని నిర్మాత, హీరో భావించారో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఒకప్పుడు గజినీ, కత్తి లాంటి అద్భుతమైన సినిమాలిచ్చిన మురుగదాస్ నుంచి ఇలాంటి థర్డ్ గ్రేడ్ ప్రోడక్ట్ ఎవరూ ఆశించరు. స్పైడర్ లో కనీసం రెండు పాటలు బాగుంటాయి. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఒకటి రెండు ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని అయినా మెప్పిస్తాయి. కానీ సికందర్ లో పొరపాటున కూడా ఒక్క పాజిటివ్ అంశం లేకుండా దాస్ జాగ్రత్తపడ్డాడు. అందుకే తనకే కాదు సల్మాన్ ఖాన్ కు కూడా కెరీర్ బెస్ట్ డిజాస్టర్ దక్కింది.
This post was last modified on March 31, 2025 8:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…