దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయన ఎలాంటి ఆణిముత్యాలు అందించారో తెలిసిందే. మణిరత్నం సినిమాలెలా ఉంటాయన్నది పక్కన పెడితే.. నటీనటులకు మణిరత్నం ఇచ్చే టచ్ వేరుగా ఉంటుంది. మరే సినిమాలో లేనంత అత్యుత్తమంగా ఆయన సినిమాల్లో కనిపిస్తారు నటీనటులు. ఒక పట్టాన రాజీ పడని మణిరత్నంను మెప్పించడం అంత సులువు కాదని ఆర్టిస్టులు అంటుంటారు. కానీ ‘యువ’ సినిమా చేసేటపుడు మాత్రం మణిరత్నంను సూర్య మెప్పించగలిగినా.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను మాత్రం మెప్పించలేకపోయాడట.
మణిరత్నం షాట్ ఓకే అన్నా కూడా.. ఆ ఏడీ సూర్య నటన బాగాలేదని మొహం మీద చెప్పేసి మళ్లీ అతడితో ఆ సీన్ చేయించారట. అంత ధైర్యంగా సూర్య లాంటి పెద్ద హీరోకు ఆ మాట చెప్పి అతడితో మళ్లీ సీన్ చేయించిన డేరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్.. తెలుగమ్మాయే అయిన సుధ కొంగర కావడం విశేషం.
మణిరత్నం శిష్యరికం తర్వాత తెలుగులో ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమా ఏదో తీసిన సుధ.. కొన్నేళ్ల కిందట ‘ఇరుదు సుట్రు’ (తెలుగులో ‘గురు’)తో తన సత్తా చాటింది. ఇప్పుడామె సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. అమేజాన్ ప్రైమ్లో వచ్చే నెల 12న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సూర్య మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సుధతో తన పరిచయం, ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.
రెండు దశాబ్దాల కిందటే సుధతో పరిచయమైందని, ‘యువ’ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అని.. ఒక సన్నివేశాన్ని మణిరత్నం ఓకే చేసినా.. ఆమె మాత్రం తన దగ్గరికొచ్చి బాగా నటించలేదని చెప్పిందని, ఇంకా బాగా చేయగలవని మొహమాటం లేకుండా చెప్పి తనతో మళ్లీ ఆ సన్నివేశం చేయించిందని.. తన తీరు ఎంతో నచ్చి అప్పట్నుంచి తనతో జర్నీ చేస్తున్నానని సూర్య వెల్లడించాడు. ‘ఆకాశం నీ హద్దురా’ కథ చెప్పగానే మరో మాట లేకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకుని తనే సొంతంగా నిర్మించినట్లు సూర్య వెల్లడించాడు.
This post was last modified on October 30, 2020 6:16 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…