దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయన ఎలాంటి ఆణిముత్యాలు అందించారో తెలిసిందే. మణిరత్నం సినిమాలెలా ఉంటాయన్నది పక్కన పెడితే.. నటీనటులకు మణిరత్నం ఇచ్చే టచ్ వేరుగా ఉంటుంది. మరే సినిమాలో లేనంత అత్యుత్తమంగా ఆయన సినిమాల్లో కనిపిస్తారు నటీనటులు. ఒక పట్టాన రాజీ పడని మణిరత్నంను మెప్పించడం అంత సులువు కాదని ఆర్టిస్టులు అంటుంటారు. కానీ ‘యువ’ సినిమా చేసేటపుడు మాత్రం మణిరత్నంను సూర్య మెప్పించగలిగినా.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను మాత్రం మెప్పించలేకపోయాడట.
మణిరత్నం షాట్ ఓకే అన్నా కూడా.. ఆ ఏడీ సూర్య నటన బాగాలేదని మొహం మీద చెప్పేసి మళ్లీ అతడితో ఆ సీన్ చేయించారట. అంత ధైర్యంగా సూర్య లాంటి పెద్ద హీరోకు ఆ మాట చెప్పి అతడితో మళ్లీ సీన్ చేయించిన డేరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్.. తెలుగమ్మాయే అయిన సుధ కొంగర కావడం విశేషం.
మణిరత్నం శిష్యరికం తర్వాత తెలుగులో ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమా ఏదో తీసిన సుధ.. కొన్నేళ్ల కిందట ‘ఇరుదు సుట్రు’ (తెలుగులో ‘గురు’)తో తన సత్తా చాటింది. ఇప్పుడామె సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. అమేజాన్ ప్రైమ్లో వచ్చే నెల 12న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సూర్య మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సుధతో తన పరిచయం, ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.
రెండు దశాబ్దాల కిందటే సుధతో పరిచయమైందని, ‘యువ’ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అని.. ఒక సన్నివేశాన్ని మణిరత్నం ఓకే చేసినా.. ఆమె మాత్రం తన దగ్గరికొచ్చి బాగా నటించలేదని చెప్పిందని, ఇంకా బాగా చేయగలవని మొహమాటం లేకుండా చెప్పి తనతో మళ్లీ ఆ సన్నివేశం చేయించిందని.. తన తీరు ఎంతో నచ్చి అప్పట్నుంచి తనతో జర్నీ చేస్తున్నానని సూర్య వెల్లడించాడు. ‘ఆకాశం నీ హద్దురా’ కథ చెప్పగానే మరో మాట లేకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకుని తనే సొంతంగా నిర్మించినట్లు సూర్య వెల్లడించాడు.
This post was last modified on October 30, 2020 6:16 pm
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…