Movie News

మణిరత్నం‌కు షాట్ ఓకే.. కానీ ఆమె ఒప్పుకోలేదు


దక్షిణాదిన లెజెండరీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయన ఎలాంటి ఆణిముత్యాలు అందించారో తెలిసిందే. మణిరత్నం సినిమాలెలా ఉంటాయన్నది పక్కన పెడితే.. నటీనటులకు మణిరత్నం ఇచ్చే టచ్ వేరుగా ఉంటుంది. మరే సినిమాలో లేనంత అత్యుత్తమంగా ఆయన సినిమాల్లో కనిపిస్తారు నటీనటులు. ఒక పట్టాన రాజీ పడని మణిరత్నంను మెప్పించడం అంత సులువు కాదని ఆర్టిస్టులు అంటుంటారు. కానీ ‘యువ’ సినిమా చేసేటపుడు మాత్రం మణిరత్నంను సూర్య మెప్పించగలిగినా.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ను మాత్రం మెప్పించలేకపోయాడట.

మణిరత్నం షాట్ ఓకే అన్నా కూడా.. ఆ ఏడీ సూర్య నటన బాగాలేదని మొహం మీద చెప్పేసి మళ్లీ అతడితో ఆ సీన్ చేయించారట. అంత ధైర్యంగా సూర్య లాంటి పెద్ద హీరోకు ఆ మాట చెప్పి అతడితో మళ్లీ సీన్ చేయించిన డేరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్.. తెలుగమ్మాయే అయిన సుధ కొంగర కావడం విశేషం.

మణిరత్నం శిష్యరికం తర్వాత తెలుగులో ‘ఆంధ్రా అందగాడు’ అనే చిన్న సినిమా ఏదో తీసిన సుధ.. కొన్నేళ్ల కిందట ‘ఇరుదు సుట్రు’ (తెలుగులో ‘గురు’)తో తన సత్తా చాటింది. ఇప్పుడామె సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. అమేజాన్ ప్రైమ్‌లో వచ్చే నెల 12న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సూర్య మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సుధతో తన పరిచయం, ప్రయాణం గురించి చెప్పుకొచ్చాడు.

రెండు దశాబ్దాల కిందటే సుధతో పరిచయమైందని, ‘యువ’ సినిమాకు ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అని.. ఒక సన్నివేశాన్ని మణిరత్నం ఓకే చేసినా.. ఆమె మాత్రం తన దగ్గరికొచ్చి బాగా నటించలేదని చెప్పిందని, ఇంకా బాగా చేయగలవని మొహమాటం లేకుండా చెప్పి తనతో మళ్లీ ఆ సన్నివేశం చేయించిందని.. తన తీరు ఎంతో నచ్చి అప్పట్నుంచి తనతో జర్నీ చేస్తున్నానని సూర్య వెల్లడించాడు. ‘ఆకాశం నీ హద్దురా’ కథ చెప్పగానే మరో మాట లేకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకుని తనే సొంతంగా నిర్మించినట్లు సూర్య వెల్లడించాడు.

This post was last modified on October 30, 2020 6:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

36 seconds ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

2 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago