Movie News

సెకండ్ ఇన్నింగ్స్….బాలయ్య సరైన మాట

మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా వరసగా ఫ్లాపులు చూసినప్పుడు మీడియా వర్గాలు ఈ పదాలను వాడుతాయి. కానీ బాలకృష్ణ మాత్రం తనకిది ఒంటబట్టదని తేల్చి చెప్పేశారు. ఆదిత్య 369 ఏప్రిల్ 4 రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికాయన విచ్చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ తనకు తెలియదని, విజయవంతమైన సినిమాలు, మూడుసార్లు ఎమ్మెల్యే, అన్ స్టాపబుల్ షో, క్యాన్సర్ ఆసుపత్రి ఇలా అన్ని చేసుకుంటూ వచ్చానన్నారు.

కొడుకుని, మనవడిని అందరిని మెప్పిస్తూ ఇప్పటి రెండు జనరేషన్లకు కనెక్ట్ అయ్యేలా అన్ని జానర్లలో చిత్రాలు చేయడం నాన్న నుంచి అందుకున్న స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు. మాయాబజార్, సీతారామ కళ్యాణం, శ్రీ కృష్ణ పాండవీయం లాంటి క్లాసిక్స్ సరసన ఆదిత్య 369 ఉంటుందని, ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే తనకు ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చిందని వివరించారు. భైరవ ద్వీపంలో కురూపి లాంటి సాహసవంతమైన పాత్రలను పోషించడానికి కారణాలు వివరించారు. అంతే కాదు ఆదిత్య 369 సీక్వెల్ త్వరలోనే ప్రారంభమవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.

బాలయ్య అన్నారని కాదు కానీ నిజంగానే ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అవసరం ఎప్పుడూ పడలేదు. ఏనాడూ గ్యాప్ తీసుకోలేదు. ఫ్లాపులు పలకరిస్తున్నా సరే వేగంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు ఎన్నో సాధించారు. అఖండతో మొదలుపెట్టి మొన్నటి డాకు మహారాజ్ దాకా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు అఖండ 2 తాండవం మీద అంచనాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. ఇలాంటి టైంలో ఆదిత్య 369 లాంటి మూడు దశాబ్దాల పాత క్లాసిక్ ని మళ్ళీ చూసే ఛాన్స్ రావడం కొత్త తరం ప్రేక్షకుల అదృష్టమే. మంచి ఓపెనింగ్స్ తో పాటు భారీ స్పందన దక్కే అవకాశాలున్నాయి.

This post was last modified on March 30, 2025 9:38 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Balakrishna

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago