ఈ మధ్య కొన్ని తెలుగు పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్ మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్స్ వివాదాస్పదం అవుతున్నాయి. గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’లో సితార్ సాంగ్లో.. ‘పుష్ప-2’లో పీలింగ్స్ సాంగ్లో కొన్ని స్టెప్స్ మీద అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి చిత్రం ‘డాకు మహారాజ్’లోనూ దబిడి దిబిడి పాట మీదా వివాదం తప్పలేదు. ఇక లేటెస్ట్గా ‘రాబిన్ హుడ్’ సినిమాలోని ‘అదిదా సర్ప్రైజు’ పాటలో కేతిక శర్మతో వేయించిన హుక్ స్టెప్ మీద పెద్ద వివాదమే నడిచింది. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ స్పందించి.. మహిళలతో వల్గర్ స్టెప్స్ వేయిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ పాట స్టెప్స్కు సంబంధించి కరెక్షన్లు జరుగుతున్నట్లుగా టీం వర్గాలు హింట్ ఇచ్చాయి. ఇక ఈ రోజు ‘రాబిన్ హుడ్’ థియేటర్లలో ‘అదిదా సర్ప్రైజు’ పాట చూసిన వాళ్లకు సర్ప్రైజ్ ఎదురైంది. వివాదాస్పదం అయిన హుక్ స్టెప్ సినిమాలో కనిపించలేదు. అలా అని ఆ ఫ్రేమ్ మొత్తం తీసేసి వేరే స్టెప్తో రీప్లేస్ చేశారా అంటే అదీ లేదు. ఇక్కడ టీం తెలివిగా మేనేజ్ చేసింది.
కేతిక క్లోజప్ కనిపించేలా ఫ్రేమ్ను ఎడిట్ చేసింది. దీంతో నడుం దగ్గర దృశ్యం కనిపించలేదు. ఆ రకంగా వివాదాస్పదం అయిన హుక్ స్టెప్ సినిమాలో కనిపించకుండా జాగ్రత్త పడింది టీం. ఐతే ఈ స్టెప్ చూసి ఊగిపోయిన యువ ప్రేక్షకులు మాత్రం స్క్రీన్ మీద అది లేకపోయేసరికి ఒకింత నిరాశపడే ఉంటారు. రాబిన్ హుడ్ టీం నిర్ణయాన్ని అభినందిస్తున్న వాళ్లూ ఉన్నారు. వీరీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేయడానికి డ్యాన్స్ మాస్టర్లు భయపడతారనడంలో సందేహం లేదు.
This post was last modified on March 28, 2025 9:41 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…