Movie News

ప్రభాస్ పెళ్లి గురించి మళ్ళీ పుకార్లు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ఉన్న ప్రభాస్ పెళ్లి గురించి హఠాత్తుగా మళ్ళీ పుకార్లు మొదలైపోయాయి. హైదరాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం కుదిరిందని, త్వరలోనే మూడు ముళ్ళు వేయబోతున్నాడని నిన్న కొన్ని మీడియా కథనాల్లో రావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎలాంటి నిజం లేదు. గతంలోనూ ఇలాగే ఓ భీమవరం ఇండస్ట్రియలిస్ట్ తనయతో సంబంధం కుదిరిందని జోరుగా ప్రచారం చేశారు. కట్ చేస్తే అలాంటిదేమి లేదని తేలింది. ఇప్పుడొచ్చిన గాసిప్ కూడా అదే కోవలోది తప్ప ఎలాంటి నిజం లేదని ప్రభాస్ వర్గం వెర్షన్.

ప్రస్తుతం ప్రభాస్ వయసు 45. తన సమకాలీకులు అందరూ ఓ ఇంటివారైపోయారు. కొందరి పిల్లలు టీనేజ్ కూడా వచ్చేశారు. కానీ డార్లింగ్ మాత్రం నో మ్యారేజ్ అంటూ సినిమాలే ప్రపంచంగా ఉంటున్నాడు. పెదనాన్న కృషంరాజు గారు ఉన్నప్పుడే ఈ ముచ్చట తీర్చుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఆయన కన్నుమూశాక శ్యామలదేవి గారు సైతం అదే పనిలో ఉన్నారు కానీ ఎంతకీ తెమలడం లేదు. ఇతర స్టార్లు ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా టైం తీసుకుంటూ ఉంటే ప్రభాస్ మాత్రం ఒకే టైంలో రెండు మూడు సెట్స్ మీద ఉంచి నిమిషం ఖాళీ లేకుండా చూసుకుంటున్నాడు.

సో ఏతావాతా ఫైనల్ గా తేలేది ఏమిటంటే ప్రభాస్ తానుగా శుభవార్త చెబితే తప్ప ఈ గాసిప్స్ కి శుభం కార్డు పడదు. గతంలో అనుష్కతోనే లగ్గమవుతుందని వార్తలు తిరిగి ఫ్యాన్స్ అది నిజమేమో అని నమ్మేదాకా వచ్చారు. ఆశ్చర్యకరంగా నాలుగు పదుల వయసు దాటినా స్వీటీ కూడా ఇంకా బ్రహ్మచారిగానే ఉంది. ఘాటీ ప్రమోషన్లు మొదలైనప్పుడు దీనికి సంబంధించిన టాపిక్ ఏమైనా వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ సెట్స్ లో అడుగు పెడతాడు. అటుపై కల్కి 2, సలార్ 2 శౌర్యంగ పర్వం ఉంటాయి. ఒకవేళ రాజాసాబ్ కనక బ్లాక్ బస్టరైతే దానికీ కొనసాగింపు ఉంటుంది.

This post was last modified on March 28, 2025 10:16 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago