టాలీవుడ్ లో పునర్జన్మలది సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డు. ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ కథతో వచ్చాయి. ఏఎన్ఆర్ మూగ మనసులు దానికి క్లాసిక్ ఉదాహరణ అనుకుంటే ఇప్పటి తరానికి మగధీర, మనం గురించి చెప్పొచ్చు. ఒక జంట చనిపోయాక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టి పూర్వ జన్మ తాలూకు జ్ఞాపకాలతో ముడిపడి ప్రయాణం చేయడమనే పాయింట్ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎవరూ ఈ పాయింట్ టచ్ చేయలేదు. తాజాగా వినిపిస్తున్న లీక్ ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీలో ఈ కాన్సెప్ట్ ఉండొచ్చని అంటున్నారు.
అల్లు అర్జున్ ఇందులో రెండు పాత్రల్లో కనిపిస్తాడనే టాక్ కొద్దిరోజుల క్రితం వినిపిస్తే అందరూ డ్యూయల్ రోల్ అనుకున్నారు. కానీ అది పునర్జన్మల గురించని లేటెస్ట్ అప్డేట్. అంటే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు బన్నీలు కనిపించరు కానీ రెండు వేర్వేరు గెటప్స్ అయితే ఉంటయన్న మాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పీరియాడిక్ సెటప్ ఉంటుందని కాకపోతే మగధీరలా రాజులు, యుద్ధాలు కాదట. సగటు కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లోనే అట్లీ మార్కు హీరోయిజం చూపిస్తూ డిఫరెంట్ గా రాసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నారు. అంతా ఓకే అయితే ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు ప్రకటన రానుంది.
పుష్ప 2 తర్వాత సినిమా కావడంతో ఐకాన్ స్టార్ ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఎంత అట్లీ అయినా గుడ్డిగా నమ్మడానికి లేదు. ఇటీవలే ఆయన రచనలో బేబీ జాన్ ఎలాంటి ఫలితం అందుకుందో చూశాం. జవాన్ బ్లాక్ బస్టరే కానీ అందులో రొటీన్ కంటెంట్ మీద కామెంట్లు లేకపోలేదు. అయితే అట్లీ ఇవన్నీ పట్టించుకునే రకం కాదు. మాస్ ఆడియన్స్ ని ఊగిపోయేలా చేయడంలో ఇతని స్టయిలే వేరు. ఇప్పుడు కూడా అదే ఫాలో కావొచ్చు. బడ్జెట్ ఎంతనేది బయటికి చెప్పడం లేదు కానీ మూడు వందల కోట్ల పైమాటేనట. సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఉండొచ్చని టాక్.
This post was last modified on March 28, 2025 10:07 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…
టీడీపీ సీనియర్ నాయకుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న చింతమనేని ప్రభాకర్.. తన చెయ్యి పెద్దదని…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత…
ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గత వారం రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్రభుత్వం…
స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…