Movie News

వైరల్: ఆ దేశంలో కోహ్లీ లాంటి నటుడు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలినవారి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. కానీ తాజాగా వైరల్ అయిన ఫోటో మాత్రం క్రికెట్‌కు సంబంధం లేకుండా నేరుగా టీవీ స్క్రీన్ నుంచి వచ్చింది. టర్కీకి చెందిన ప్రముఖ నటుడు కావిట్ సెటిన్ గునెర్ (Cavit Cetin Guner) ఒక టీవీ సీరీస్‌లో కనిపించిన సన్నివేశాన్ని చూసిన నెటిజన్లు అతన్ని కోహ్లీగా భావించి ఆశ్చర్యపోయారు. ‘విరాట్ టీవీ సీరీస్‌లో ఎలా?’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

ఈ హంగామా రెడ్డిట్ (Reddit) వేదికగా మొదలైంది. ఒక యూజర్, “అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం చేశాడు” అనే క్యాప్షన్‌తో కావిట్ సెటిన్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో కోహ్లీని తలపించే కళ్లు, గడ్డం, మొఖ ఆకృతి, హెయిర్‌స్టైల్‌ చూసిన నెటిజన్లు ఏకంగా ఇది కోహ్లీ అని ఫిక్స్ అయ్యారు. “ఇతను కోహ్లీ కాదని నమ్మించాలంటే ఎంతో కష్టమే” అంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు “ఇది అసలు కోహ్లీ కాదు, టర్కీ కోహ్లీ” అంటూ హ్యూమర్ జోడించారు.

వాస్తవానికి ఆ ఫోటో ‘Dirilis: Ertugrul’ అనే తుర్కీ హిస్టారికల్ డ్రామా సీరీస్‌కి సంబంధించినది. ఇది 2014లో మొదలై 2019 వరకు ఐదు సీజన్లుగా ప్రసారం అయింది. ఈ సీరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ ప్రేక్షకుల్లో విపరీతంగా హిట్ అయింది. కావిట్‌ సెటిన్ ఇందులో ఒక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనని విరాట్ కోహ్లీతో పోల్చడంలో క్రికెట్ వరల్డ్ లో వైరల్ అయ్యాడు. ఇదివరకూ కూడా కోహ్లీ లుక్స్‌ను పోలిన వారిని స్టేడియాల్లో, రోడ్లపై చూసిన సంగతి తెలిసిందే.

కానీ ఈసారి మాత్రం టీవీ స్క్రీన్ మీద కనిపించడంతో ఆసక్తికర చర్చ సాగింది. ఇలా సెలబ్రిటీలు ఎంతటి ప్రభావం కలిగిస్తారో, వారి లుక్స్‌ను పోలిన వ్యక్తులు ఎంత విపరీతంగా వైరల్ అవుతారో మరోసారి రుజువైంది. దీనిపై ఇంకా కోహ్లీ లేదా అనుష్క నుంచి స్పందన రాలేదప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఇప్పట్లో ఈ పోలికని మర్చిపోరనడంలో సందేహం లేదు.

This post was last modified on March 26, 2025 9:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago