అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకోని తెలుగు కథానాయిక చాందిని చౌదరి. ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నవే. సినిమాల్లోకి రావడానికి ముందే యూట్యూబ్లో స్టార్ అయిందామె. సోషల్ మీడియాలో ఆమెకు మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాల్లో మాత్రం ఆమెకు ప్రతిసారీ నిరాశే వ్యక్తమవుతూ వచ్చింది.
కుందనపు బొమ్మ, మను, హౌరా బ్రిడ్జ్ లాంటి సినిమాల్లో నటించిన చాందిని వాటితో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేదు. అలాగే విజయాలూ అందుకోలేదు. ఇంత అందమైన, బాగా నటించగల ఈ తెలుగమ్మాయికి ఒక మంచి హిట్ పడితే బావుణ్నని ఎంతోమంది అనుకున్నారు. వాళ్లు కోరుకున్న స్థాయిలో కాకపోయినా.. లేటెస్ట్ ఓటీటీ ఫిలిం ‘కలర్ ఫోటో’ చాందినికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాందిని చేసిన దీప్తి పాత్రకు మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఈ సినిమాను ఫిలిం సెలబ్రెటీలు తెగ పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అలా పొగుడుతున్న వాళ్లలో కొందరు చాందిని పేరును మరిచిపోతున్నారు. హీరో సుహాస్, విలన్ పాత్రధారి సునీల్, దర్శక నిర్మాతలు సందీప్ రాజ్, సాయిరాజేష్లను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఓవర్ లుక్లోనో, మరో కారణంతోనో చాందిని పేరు ప్రస్తావించట్లేదు. అది చూసి చాందిని హర్టయింది. తన పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతూ వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసిన ఆమె.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే అని, ఇది బాధాకరమైన విషయమని ఎవరి పేర్లూ ప్రస్తావించకుండా ఒక ట్వీట్ వేసింది.
తాజాగా ‘కలర్ ఫోటో’ను ప్రశంసించిన సీనియర్ నటుడు జగపతిబాబు సైతం చాందిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సంగీత దర్శకుడు కాలభైరవ సహా అందరినీ పొగిడి తన పేరును ప్రస్తావించకపోవడం, మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలాగే చేయడంతో చాందిని బాగా హర్టయినట్లే ఉంది. లేక లేక ఒక సినిమా మంచి స్పందన తెచ్చుకుంటే అందులోనూ తనను గుర్తించకపోవడం ఆమెను బాధించినట్లుంది.
This post was last modified on October 29, 2020 6:19 pm
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…