అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకోని తెలుగు కథానాయిక చాందిని చౌదరి. ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నవే. సినిమాల్లోకి రావడానికి ముందే యూట్యూబ్లో స్టార్ అయిందామె. సోషల్ మీడియాలో ఆమెకు మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాల్లో మాత్రం ఆమెకు ప్రతిసారీ నిరాశే వ్యక్తమవుతూ వచ్చింది.
కుందనపు బొమ్మ, మను, హౌరా బ్రిడ్జ్ లాంటి సినిమాల్లో నటించిన చాందిని వాటితో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేదు. అలాగే విజయాలూ అందుకోలేదు. ఇంత అందమైన, బాగా నటించగల ఈ తెలుగమ్మాయికి ఒక మంచి హిట్ పడితే బావుణ్నని ఎంతోమంది అనుకున్నారు. వాళ్లు కోరుకున్న స్థాయిలో కాకపోయినా.. లేటెస్ట్ ఓటీటీ ఫిలిం ‘కలర్ ఫోటో’ చాందినికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాందిని చేసిన దీప్తి పాత్రకు మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఈ సినిమాను ఫిలిం సెలబ్రెటీలు తెగ పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అలా పొగుడుతున్న వాళ్లలో కొందరు చాందిని పేరును మరిచిపోతున్నారు. హీరో సుహాస్, విలన్ పాత్రధారి సునీల్, దర్శక నిర్మాతలు సందీప్ రాజ్, సాయిరాజేష్లను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఓవర్ లుక్లోనో, మరో కారణంతోనో చాందిని పేరు ప్రస్తావించట్లేదు. అది చూసి చాందిని హర్టయింది. తన పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతూ వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసిన ఆమె.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే అని, ఇది బాధాకరమైన విషయమని ఎవరి పేర్లూ ప్రస్తావించకుండా ఒక ట్వీట్ వేసింది.
తాజాగా ‘కలర్ ఫోటో’ను ప్రశంసించిన సీనియర్ నటుడు జగపతిబాబు సైతం చాందిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సంగీత దర్శకుడు కాలభైరవ సహా అందరినీ పొగిడి తన పేరును ప్రస్తావించకపోవడం, మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలాగే చేయడంతో చాందిని బాగా హర్టయినట్లే ఉంది. లేక లేక ఒక సినిమా మంచి స్పందన తెచ్చుకుంటే అందులోనూ తనను గుర్తించకపోవడం ఆమెను బాధించినట్లుంది.
This post was last modified on October 29, 2020 6:19 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…