అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకోని తెలుగు కథానాయిక చాందిని చౌదరి. ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నవే. సినిమాల్లోకి రావడానికి ముందే యూట్యూబ్లో స్టార్ అయిందామె. సోషల్ మీడియాలో ఆమెకు మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాల్లో మాత్రం ఆమెకు ప్రతిసారీ నిరాశే వ్యక్తమవుతూ వచ్చింది.
కుందనపు బొమ్మ, మను, హౌరా బ్రిడ్జ్ లాంటి సినిమాల్లో నటించిన చాందిని వాటితో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేదు. అలాగే విజయాలూ అందుకోలేదు. ఇంత అందమైన, బాగా నటించగల ఈ తెలుగమ్మాయికి ఒక మంచి హిట్ పడితే బావుణ్నని ఎంతోమంది అనుకున్నారు. వాళ్లు కోరుకున్న స్థాయిలో కాకపోయినా.. లేటెస్ట్ ఓటీటీ ఫిలిం ‘కలర్ ఫోటో’ చాందినికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాందిని చేసిన దీప్తి పాత్రకు మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఈ సినిమాను ఫిలిం సెలబ్రెటీలు తెగ పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అలా పొగుడుతున్న వాళ్లలో కొందరు చాందిని పేరును మరిచిపోతున్నారు. హీరో సుహాస్, విలన్ పాత్రధారి సునీల్, దర్శక నిర్మాతలు సందీప్ రాజ్, సాయిరాజేష్లను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఓవర్ లుక్లోనో, మరో కారణంతోనో చాందిని పేరు ప్రస్తావించట్లేదు. అది చూసి చాందిని హర్టయింది. తన పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతూ వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసిన ఆమె.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే అని, ఇది బాధాకరమైన విషయమని ఎవరి పేర్లూ ప్రస్తావించకుండా ఒక ట్వీట్ వేసింది.
తాజాగా ‘కలర్ ఫోటో’ను ప్రశంసించిన సీనియర్ నటుడు జగపతిబాబు సైతం చాందిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సంగీత దర్శకుడు కాలభైరవ సహా అందరినీ పొగిడి తన పేరును ప్రస్తావించకపోవడం, మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలాగే చేయడంతో చాందిని బాగా హర్టయినట్లే ఉంది. లేక లేక ఒక సినిమా మంచి స్పందన తెచ్చుకుంటే అందులోనూ తనను గుర్తించకపోవడం ఆమెను బాధించినట్లుంది.
This post was last modified on October 29, 2020 6:19 pm
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…