అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపునకు నోచుకోని తెలుగు కథానాయిక చాందిని చౌదరి. ఆమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నవే. సినిమాల్లోకి రావడానికి ముందే యూట్యూబ్లో స్టార్ అయిందామె. సోషల్ మీడియాలో ఆమెకు మాంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాల్లో మాత్రం ఆమెకు ప్రతిసారీ నిరాశే వ్యక్తమవుతూ వచ్చింది.
కుందనపు బొమ్మ, మను, హౌరా బ్రిడ్జ్ లాంటి సినిమాల్లో నటించిన చాందిని వాటితో ఎలాంటి గుర్తింపు తెచ్చుకోలేదు. అలాగే విజయాలూ అందుకోలేదు. ఇంత అందమైన, బాగా నటించగల ఈ తెలుగమ్మాయికి ఒక మంచి హిట్ పడితే బావుణ్నని ఎంతోమంది అనుకున్నారు. వాళ్లు కోరుకున్న స్థాయిలో కాకపోయినా.. లేటెస్ట్ ఓటీటీ ఫిలిం ‘కలర్ ఫోటో’ చాందినికి ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చింది. ఇందులో చాందిని చేసిన దీప్తి పాత్రకు మంచి స్పందనే వచ్చింది.
ఐతే ఈ సినిమాను ఫిలిం సెలబ్రెటీలు తెగ పొగిడేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే అలా పొగుడుతున్న వాళ్లలో కొందరు చాందిని పేరును మరిచిపోతున్నారు. హీరో సుహాస్, విలన్ పాత్రధారి సునీల్, దర్శక నిర్మాతలు సందీప్ రాజ్, సాయిరాజేష్లను మాత్రమే ప్రశంసిస్తున్నారు. ఓవర్ లుక్లోనో, మరో కారణంతోనో చాందిని పేరు ప్రస్తావించట్లేదు. అది చూసి చాందిని హర్టయింది. తన పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుబడుతూ వేసిన ట్వీట్లను రీట్వీట్ చేసిన ఆమె.. సమానత్వం కోసం ఫెమినిస్టులు పోరాడేది ఇందుకే అని, ఇది బాధాకరమైన విషయమని ఎవరి పేర్లూ ప్రస్తావించకుండా ఒక ట్వీట్ వేసింది.
తాజాగా ‘కలర్ ఫోటో’ను ప్రశంసించిన సీనియర్ నటుడు జగపతిబాబు సైతం చాందిని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సంగీత దర్శకుడు కాలభైరవ సహా అందరినీ పొగిడి తన పేరును ప్రస్తావించకపోవడం, మరికొందరు సెలబ్రెటీలు కూడా ఇలాగే చేయడంతో చాందిని బాగా హర్టయినట్లే ఉంది. లేక లేక ఒక సినిమా మంచి స్పందన తెచ్చుకుంటే అందులోనూ తనను గుర్తించకపోవడం ఆమెను బాధించినట్లుంది.
This post was last modified on October 29, 2020 6:19 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…