మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే ప్రతి కొత్త దర్శకుడికీ ఓ కల. ఒక తరాన్ని ఊపు ఊపి అనేక రకాలుగా స్ఫూర్తి నింపిన తిరుగులేని హీరో ఆయన. ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన చిరు.. తనను అమితంగా అభిమానించే యువ దర్శకులకు తనతో సినిమా చేసే అరుదైన అవకాశం కల్పిస్తున్నాడు. బాబీ అలాగే కలను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి వంతు వచ్చింది. ఐతే అనిల్ కంటే ముందే, బాబీతో పాటుగానే చిరు నుంచి పిలుపు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల.
‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో సూపర్ హిట్లు ఇవ్వడంతో ఈ యంగ్ డైరెక్టర్తో సినిమా చేయడానికి చిరు ఆసక్తి కనబరిచాడు. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. చిరు సినిమా చేజారడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ‘రాబిన్ హుడ్’ చేశాడు వెంకీ. ఇంతకీ చిరు చిత్రం ఏమైందనే విషయమై మీడియాతో మాట్లాడాడు వెంకీ. ‘‘భీష్మ తర్వాత చిరంజీవి గారి కోసం కథ రాశాను. ఆయనకు బేసిక్ ఐడియా చాలా నచ్చింది. స్క్రిప్టు రెడీ చేసుకుని రమ్మన్నారు. స్వతహాగా నేను చిరు అభిమానిని.
ఆయనతో చేసే సినిమా అద్భుతంగా ఉండాలని అనేక అంశాలను జోడించి చాలా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేశా. కానీ అది ఎక్కడో ఆయనకు సంతృప్తినివ్వలేదు. దీంతో ఇంకో కథ చేసుకుని వస్తానని చెప్పి వచ్చేశా. ఇంతలో నితిన్ అన్నను కలిశాను. నా దగ్గర అప్పటికే ఉన్న ఓ కథ ఐడియా గురించి చెబితే ఓకే అన్నారు. ఆయనకు తగ్గట్లుగా ఆ ఐడియాను స్క్రిప్టుగా మలిచి ‘రాబిన్ హుడ్’ చేశా. చిరుతో ఇంతకుముందు సినిమా అవకాశం మిస్సయినప్పటికీ.. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేస్తాననే ఆశిస్తున్నా’’ అని వెంకీ తెలిపాడు.
This post was last modified on March 25, 2025 10:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…