Political News

అమిత్ షాతో ఎంపీ రాయలు భేటీ.. ఏం జరుగుతోంది?

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఓ ఫైల్ నిండా పేపర్లను పట్టుకెళ్లిన రాయలు.. వాటిని అమిత్ షాకు చూపిస్తూ.. వాటిలో కొన్నింటిని ఆయనకు అందజేస్తూ కనిపించారు. ఎంపీ రాయలు ఇచ్చిన సదరు పత్రాలను అమిత్ షా కూడా కూలంకషంగా పరిశీలిస్తూ కనిపించారు. ఈ ఫొటో బయటకు వచ్చినంతనే ఏపీలో పెద్ద చర్చకే తెర లేసింది.

వాస్తవానికి రాయలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీలో నెంబర్ 2గా కొనసాగుతున్న అమిత్ షాతో రాయలు భేటీకి పెద్దగా ప్రాధాన్యతేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్డీఏలో రథసారథి స్థానంలో బీజేపీ కొనసాగుతుంటే… బీజేపీ తర్వాత అత్యదిక ఎంపీ స్థానాలను కలిగి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతోంది. ఈ లెక్కన ఏదో ఎన్డీఏ వ్యవహారం గురించో వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చునని, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎన్డీఏ వ్యూహాలపై సమాలోచనలు చేసేందుకు వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చని అనుకోవచ్చు. కానీ అవేవీ చర్చకు రావడం లేదు.

సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో ఏపీలో కూడా డిల్లీ తరహాలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించిన తరహాలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, అందులో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ముడుపులను విదేశాలు పంపారని రాయలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలు కోరినట్లు ఈడీ రంగంలోకి దిగితే ఇక తమ పని అయిపోయినట్టేనని వైసీపీ కీలక నేతలు భయాందోళనలకు గురయ్యారన్న విశ్లషణలు వినిపించాయి.

ఈ విశ్లేషణలు సాగుతున్న క్రమంలోనే…మద్యం కుంభకోణంపై రాయలు పార్లమెంటులో ప్రస్తావించిన మరునాడే.. నేరుగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో వైైసీపీ శిబిరంలో వణుకు మొదలైందని చెప్పాలి. అమిత్ షాతో రాయలు బేటీకి సంబంధించిన వార్తలు విన్నంతనే… ఇక జగన్ పని అయిపోయినట్టేనన్న విశ్లేషణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను రాయలు ఇస్తూ ఉంటే… అమిత్ షా వాటిని లోతుగా పరిశీలిస్తున్నారంటూ వారిద్దరి భేటీ దృశ్యాలను చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ రాయలు వైసీపీ శిబిరంలో వణుకు పుట్టించారన్న వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.

This post was last modified on March 26, 2025 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

2 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

2 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

2 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

2 hours ago

హహ హాసిని… స్టేజ్ మీద ఏడ్చేసింది

జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…

4 hours ago

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

6 hours ago