Political News

అమిత్ షాతో ఎంపీ రాయలు భేటీ.. ఏం జరుగుతోంది?

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఓ ఫైల్ నిండా పేపర్లను పట్టుకెళ్లిన రాయలు.. వాటిని అమిత్ షాకు చూపిస్తూ.. వాటిలో కొన్నింటిని ఆయనకు అందజేస్తూ కనిపించారు. ఎంపీ రాయలు ఇచ్చిన సదరు పత్రాలను అమిత్ షా కూడా కూలంకషంగా పరిశీలిస్తూ కనిపించారు. ఈ ఫొటో బయటకు వచ్చినంతనే ఏపీలో పెద్ద చర్చకే తెర లేసింది.

వాస్తవానికి రాయలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీలో నెంబర్ 2గా కొనసాగుతున్న అమిత్ షాతో రాయలు భేటీకి పెద్దగా ప్రాధాన్యతేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్డీఏలో రథసారథి స్థానంలో బీజేపీ కొనసాగుతుంటే… బీజేపీ తర్వాత అత్యదిక ఎంపీ స్థానాలను కలిగి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతోంది. ఈ లెక్కన ఏదో ఎన్డీఏ వ్యవహారం గురించో వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చునని, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎన్డీఏ వ్యూహాలపై సమాలోచనలు చేసేందుకు వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చని అనుకోవచ్చు. కానీ అవేవీ చర్చకు రావడం లేదు.

సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో ఏపీలో కూడా డిల్లీ తరహాలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించిన తరహాలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, అందులో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ముడుపులను విదేశాలు పంపారని రాయలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలు కోరినట్లు ఈడీ రంగంలోకి దిగితే ఇక తమ పని అయిపోయినట్టేనని వైసీపీ కీలక నేతలు భయాందోళనలకు గురయ్యారన్న విశ్లషణలు వినిపించాయి.

ఈ విశ్లేషణలు సాగుతున్న క్రమంలోనే…మద్యం కుంభకోణంపై రాయలు పార్లమెంటులో ప్రస్తావించిన మరునాడే.. నేరుగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో వైైసీపీ శిబిరంలో వణుకు మొదలైందని చెప్పాలి. అమిత్ షాతో రాయలు బేటీకి సంబంధించిన వార్తలు విన్నంతనే… ఇక జగన్ పని అయిపోయినట్టేనన్న విశ్లేషణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను రాయలు ఇస్తూ ఉంటే… అమిత్ షా వాటిని లోతుగా పరిశీలిస్తున్నారంటూ వారిద్దరి భేటీ దృశ్యాలను చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ రాయలు వైసీపీ శిబిరంలో వణుకు పుట్టించారన్న వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

8 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

9 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

11 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

11 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

12 hours ago