Political News

అమిత్ షాతో ఎంపీ రాయలు భేటీ.. ఏం జరుగుతోంది?

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఓ ఫైల్ నిండా పేపర్లను పట్టుకెళ్లిన రాయలు.. వాటిని అమిత్ షాకు చూపిస్తూ.. వాటిలో కొన్నింటిని ఆయనకు అందజేస్తూ కనిపించారు. ఎంపీ రాయలు ఇచ్చిన సదరు పత్రాలను అమిత్ షా కూడా కూలంకషంగా పరిశీలిస్తూ కనిపించారు. ఈ ఫొటో బయటకు వచ్చినంతనే ఏపీలో పెద్ద చర్చకే తెర లేసింది.

వాస్తవానికి రాయలు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఇక బీజేపీలో నెంబర్ 2గా కొనసాగుతున్న అమిత్ షాతో రాయలు భేటీకి పెద్దగా ప్రాధాన్యతేమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్డీఏలో రథసారథి స్థానంలో బీజేపీ కొనసాగుతుంటే… బీజేపీ తర్వాత అత్యదిక ఎంపీ స్థానాలను కలిగి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టీడీపీ కొనసాగుతోంది. ఈ లెక్కన ఏదో ఎన్డీఏ వ్యవహారం గురించో వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చునని, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎన్డీఏ వ్యూహాలపై సమాలోచనలు చేసేందుకు వారిద్దరూ భేటీ అయి ఉండవచ్చని అనుకోవచ్చు. కానీ అవేవీ చర్చకు రావడం లేదు.

సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో ఏపీలో కూడా డిల్లీ తరహాలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు మించిన తరహాలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, అందులో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేలాది కోట్ల రూపాయల ముడుపులను విదేశాలు పంపారని రాయలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలు కోరినట్లు ఈడీ రంగంలోకి దిగితే ఇక తమ పని అయిపోయినట్టేనని వైసీపీ కీలక నేతలు భయాందోళనలకు గురయ్యారన్న విశ్లషణలు వినిపించాయి.

ఈ విశ్లేషణలు సాగుతున్న క్రమంలోనే…మద్యం కుంభకోణంపై రాయలు పార్లమెంటులో ప్రస్తావించిన మరునాడే.. నేరుగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలవడంతో వైైసీపీ శిబిరంలో వణుకు మొదలైందని చెప్పాలి. అమిత్ షాతో రాయలు బేటీకి సంబంధించిన వార్తలు విన్నంతనే… ఇక జగన్ పని అయిపోయినట్టేనన్న విశ్లేషణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. అంతేకాకుండా మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను రాయలు ఇస్తూ ఉంటే… అమిత్ షా వాటిని లోతుగా పరిశీలిస్తున్నారంటూ వారిద్దరి భేటీ దృశ్యాలను చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ రాయలు వైసీపీ శిబిరంలో వణుకు పుట్టించారన్న వాదనలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.

This post was last modified on March 26, 2025 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైలేజ్ సరిపోలేదు మోగ్లీ

యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…

8 hours ago

అవతార్ క్రేజ్ పెరిగిందా తగ్గిందా

ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…

8 hours ago

వైసీపీకి ఆ 40 % నిల‌బ‌డుతుందా.. !

40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…

8 hours ago

సంక్రాంతి సినిమాలకు కొత్త సంకటం

ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…

9 hours ago

తమన్ చెప్పింది రైటే… కానీ కాదు

అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…

11 hours ago

అలియా సినిమాకు అడ్వాన్స్ ట్రోలింగ్

ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…

11 hours ago